రైల్వేను ఎన్నటికీ ప్రైవేటీకరించం
రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం
లోక్సభలో పీయూష్ గోయల్ స్పష్టం
దిల్లీ: రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం స్పష్టం చేశారు. పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు లోక్సభలో రైల్వేలకు నిధుల కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను సృష్టించొచ్చని అన్నారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి పథంలో పయనించగలదని చెప్పారు.
‘‘రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోం. ఇది ప్రతి భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది. అయితే రైల్వేలో సేవలను మరింత మెరుగుపర్చడం కోసం ప్రైవేటు పెట్టుబడులను మేం స్వాగతిస్తాం’’ అని గోయల్ వెల్లడించారు. ఇక 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ రైల్వే కేటాయింపులను ప్రభుత్వం భారీగా పెంచిందని ఆయన తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.1.5లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.2.15లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు.
రైలు ప్రయాణికుల భద్రతపై తాము గట్టిగా దృష్టిపెట్టామని గోయల్ ఈ సందర్భంగా అన్నారు. గత రెండేళ్లుగా ఒక్క రైలు ప్రయాణికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 2019 మార్చి తర్వాత నుంచి రైలు ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!