Afghanistan: అఫ్గాన్ పరిణామాలపై ఉన్నతస్థాయి చర్చలకు ఏర్పాట్లు
అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక.. అక్కడి పరిణామాలు, పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉన్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారకూడదని, ఈ విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి! ఇదే క్రమంలో భారత్ కూడ.. అఫ్గాన్ పరిణామాలపై...
దిల్లీ: అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక.. అక్కడి పరిణామాలు, పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉన్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారకూడదని, అందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి! ఇదే క్రమంలో భారత్ కూడా.. అఫ్గాన్ పరిణామాలపై తన ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ‘ప్రాంతీయ భద్రతా చర్చల’కు ఆతిథ్యం ఇవ్వనుంది. సంబంధిత వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. నవంబర్ 10న నిర్వహించనున్న ఈ చర్చలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అధ్యక్షత వహిస్తారని తెలిపాయి. 2018, 2019లోనూ ఇరాన్లో ఈ తరహా చర్చలు నిర్వహించగా, కరోనా కారణంగా గతేడాది రద్దు చేశారు.
ఇంకా సమాధానం చెప్పని పాక్, చైనా..
చర్చల నేపథ్యంలో భారత్.. రష్యా, ఇరాన్, చైనా, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాలకు ఆహ్వానం పంపింది. వాటి నుంచి విశేష స్పందన కూడ లభించినట్లు తెలిపింది! రష్యా, ఇరాన్.. తాము చర్చల్లో పాల్గొంటామని ఖరారు చేసినట్లు సమాచారం. అఫ్గాన్ ఇరుగు పొరుగు దేశాలే కాకుండా, మధ్య ఆసియా దేశాలూ ఇందులో పాల్గొంటుండటం విశేషం. అఫ్గాన్లో శాంతి, భద్రతలను పెంపొందించేందుకు భారత్కు ఉన్న ప్రాధాన్యానికి.. ఈ స్పందనే నిదర్శనమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పాకిస్థాన్, చైనాలు తమ సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే తాము మాత్రం హాజరుకాబోమని పాక్.. స్థానిక మీడియాకు వెల్లడించింది! దీనిపై ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘పాక్ నిర్ణయం దురదృష్టకరం. కానీ, ఆశ్చర్యం కలిగించేది కాదు. అఫ్గాన్ను తన రక్షిత ప్రాంతంగా చూస్తున్న దాని వైఖరిని ఇది ప్రతిబింబిస్తుంది. గతంలోనూ పాక్ ఈ తరహా సమావేశాలకు హాజరు కాలేద’ని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.