Vaccine: థర్డ్వేవ్ ఆపాలంటే.. ఈ వేగం సరిపోదా?
ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
నిత్యం 80లక్షల నుంచి కోటి డోసులు పంపిణీ చేయాల్సిందే అంటున్న నిపుణులు
దిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ముప్పు ప్రభావం ఉందని నిపుణులు హెచ్చరించడంతో.. దానిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్వేవ్ ముప్పు ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య నిపుణులు, టీకా తయారీదారులు విశేష కృషి చేస్తున్నారు. ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్ పంపిణీ వేగాన్ని మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిత్యం కోటి డోసుల పంపిణీ లక్ష్యం..
కరోనా థర్డ్ వేవ్ అనివార్యమైనప్పటికీ సాధ్యమైనంత వరకు దానిని నివారించాలంటే దేశ జనాభాలో దాదాపు 60శాతం మందికి రెండు డోసులు అందించాల్సి ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కూడా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇప్పటినుంచి దాదాపు ప్రతిరోజు కనీసం 80లక్షల డోసులు పంపిణీ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రతిరోజు కోటి 25లక్షల డోసులు పంపిణీ చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని.. అయినప్పటికీ నిత్యం కనీసం కోటి మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా ఈమధ్యే పేర్కొన్నారు. జులై నుంచి వేగాన్ని పెంచాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం ప్రతిరోజు 40లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నారు. ఇదే వేగంతో పంపిణీ చేస్తే ప్రభుత్వం పెట్టుకున్న డిసెంబర్ లక్ష్యాన్ని చేరుకునేది కష్టంగానే కనిపిస్తోంది.
రోజువారీ సరాసరి 40లక్షల డోసులు..
దేశంలో కరోనా వ్యాక్సిన్ మెగా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి వ్యాక్సిన్ డోసుల పంపిణీ పెరిగింది. గతనెల చివరి వారంలో నిత్యం 80లక్షల డోసులను పంపిణీ చేశారు. తర్వాత అది 40లక్షలకు తగ్గింది. ఇక గత ఆదివారంనాడు కేవలం 15లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇలా వారంలో సరాసరిగా కేవలం 40లక్షల డోసులను మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల వ్యాక్సిన్ల కొరత, మరికొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అధికమొత్తంలో వ్యాక్సిన్ పంపిణీ చేయకపోవడానికి కారణాలని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జులైలో 12కోట్ల డోసులే..
పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతున్నప్పటికీ మరికొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీంతో తమకు ఎక్కువ డోసులను పంపిణీ చేయాలని ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో జులైలో కేవలం 12కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, కేంద్రప్రభుత్వం ఉచితంగా ఇచ్చే డోసులకు అదనంగా మరో 25శాతం ప్రభుత్వ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
వ్యాక్సిన్ల కొరతే కారణమా..?
దేశంలో కరోనా వ్యాక్సిన్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు టీకా కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పంజాబ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తమకు ఎక్కువ డోసులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల వద్ద ఇంకా 2కోట్ల డోసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిలో తయారీ సంస్థలు వేగం పెంచాయి. కొవిషీల్డ్ తయారుచేస్తోన్న సీరం ఇన్స్టిట్యూట్ కేవలం జూన్ నెలలోనే దాదాపు 10కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించినట్లు తెలిపింది. అటు భారత్ బయోటెక్ కూడా ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు స్పుత్నిక్ టీకా డోసుల ఉత్పత్తిని పెంచేందుకు డాక్టర్ రెడ్డీస్ ఇతర సంస్థల సహకారం తీసుకొంటోంది. ఇక మోడెర్నా టీకాను భారత్లో దిగుమతి చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి లభించింది. ఇలా స్థానికంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు, దిగుమతి పెరిగితేనే భారత్లో వ్యాక్సిన్ డోసులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!