Trump: కరోనాతో భారత్ సర్వనాశనమైంది
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి ఈ అంశంపై మాట్లాడారు
అమెరికాకు చైనా 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలన్న ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి ఈ అంశంపై మాట్లాడారు. కరోనాతో భారత్ సర్వనాశనమైందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్తో తీవ్రంగా నష్టపోయిన అమెరికాకు చైనా 10 ట్రిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. వాస్తవానికి చైనా ప్రపంచానికి ఇంకా ఎక్కువగానే రుణ పడివుందనీ, కానీ వారికి ఇంతకంటే మించి చెల్లించే సామర్థ్యం లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు.
ప్రముఖ మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలు మాట్లాడారు. ‘చైనా చేసిన పనికి అనేక దేశాలు కకావికలమయ్యాయి. చైనా ఇది కావాలని చేసినా లేదా ప్రమాదవశాత్తు జరిగినా తీవ్ర నష్టమైతే వాటిల్లింది. ఇది వారి అసమర్థత కారణంగా జరిగినట్లు భావిస్తున్నా. అదెలా జరిగినా అనేక దేశాలు దీని నుంచి కోలుకోలేనంతగా నష్టపోయాయి. ఆ దేశాలు మళ్లీ మునుపటిలా ఉండకపోవచ్చు. అమెరికాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. కానీ మరికొన్ని దేశాలపై మరింత అధిక ప్రభావం చూపించింది’ అని వ్యాఖ్యానించారు.
వైద్య సదుపాయాలు కరవై భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘భారత్లో ఏం జరుగుతోందో చూడండి. కొవిడ్తో ఆ దేశం సర్వనాశనమైంది. ఒక్క భారత్ మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. అందుకే వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇందుకు చైనా సహకారం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చైనాతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి వేగంగా పుంజుకుంటున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం