రెండో రోజు..భారీగా తగ్గిన పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. వరసగా రెండో రోజు కూడా కొత్త కేసులు 17వేలకు దిగువనే నమోదయ్యాయి.

Updated : 05 Jan 2021 11:38 IST

24 గంటల్లో 16,375 కొత్త కేసులు..201 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. వరసగా రెండో రోజు కూడా కొత్త కేసులు 17వేలకు దిగువనే నమోదయ్యాయి. మరోవైపు, రికవరీ కేసులు కోటి దిశగా పయనిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..సోమవారం 8,96,236 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయగా, 16,375 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో నిన్నటివరకు దేశవ్యాప్తంగా 1,03,56,844 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, జూన్ 24న 16,922 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా..రెండు రోజులుగా అదే స్థాయి తగ్గుదల కనిపిస్తోంది.

ఇక, క్రియాశీల కేసులు 2.31లక్షలకు చేరుకున్నాయి. ఆ రేటు 2.36 శాతానికి తగ్గింది. ఇదిలా ఉండగా..నిన్న ఒక్కరోజే 29,091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 99.75 లక్షలు(96.19శాతం)గా ఉంది. మరోవైపు, గత 11 రోజులుగా మరణాలు 300 లోపునే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 201 మంది మరణించగా..ఇప్పటివరకు 1,49,850 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు.  

ఇవీ చదవండి: 

హెర్డ్ ఇమ్యూనిటీ వల్లే తీవ్రత తగ్గిందా..?

బర్డ్ ఫ్లూ: కేరళలో 12వేల బాతులు మృతి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని