Covid Variant: ఎయిడ్స్ రోగి నుంచి కొత్త వేరియంట్..? డెల్టా కంటే వేగంగా వ్యాప్తి..!
కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుతున్న వేళ దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్ట బి.1.1.529 వేరియంట్.. మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్ కారణంగా మరో
ఇంటర్నెట్డెస్క్: కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గుతున్న వేళ దక్షిణాఫ్రికాలో తాజాగా బయటపడ్ట బి.1.1.529 వేరియంట్.. మళ్లీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వేరియంట్ కారణంగా మరో కొవిడ్ వేవ్ ముప్పు తప్పదని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. అంతేగాక, దీనిలోని అధిక మ్యుటేషన్ల కారణంగా మునుపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని, లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. మరి ఇంతకీ ఈ కొత్త వేరియంట్ ఎక్కడి నుంచి వచ్చింది..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
హెచ్ఐవీ పేషెంట్ నుంచేనా..?
బి.1.1.529 వేరియంట్ను తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఈ వేరియంట్ ఎలా ఉత్పన్నమైందన్న దానిపై ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగిలో ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉంటుందని లండన్లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో 8.2 మిలియన్లకు పైగా హెచ్ఐవీ బాధితులున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ రోగులున్న దేశం ఇదే. గతంలో దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బీటా వేరియంట్ కూడా హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచే ఉత్పన్నమైనట్లు ఆ మధ్య నిపుణులు తెలిపారు. దీంతో తాజా వేరియంట్ కూడా వారి నుంచే వచ్చి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మ్యుటేషన్లతో అధిక వ్యాప్తి..
కరోనాలో ఇప్పటివరకు ఉన్న వేరియంట్ల కంటే బి.1.1.529 చాలా భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా.. ఒక్క స్పైక్ ప్రొటీన్లోనే 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్లో మ్యుటేషన్లు చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. మనిషి శరీరంలోకి వైరస్ ప్రవేశించడంలో స్పైక్ ప్రొటీనే కీలకంగా పనిచేస్తుంది. అక్కడే అధిక మ్యుటేషన్లు ఉండటంతో ఈ వైరస్ డెల్టా రకం కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు ఇంకా స్పష్టమైన వివరాలు కావాలని చెబుతున్నారు.
100కి పైగా కేసులు..
కొత్త వేరియంట్కు సంబంధించి దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 100కి పైగా కేసులు బయటపడ్డాయి. ఆ దేశంలో కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారిలో చాలా మందిలో ఇదే రకాన్ని గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. క్రమేపీ ఈ వేరియంట్ ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అంతేగాక, ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బోట్స్వానాలో నాలుగు కేసులను గుర్తించగా.. హాంకాంగ్లో రెండు కేసులు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారంతా ఇప్పటికే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారట.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు..?
బి.1.1.529 రకంలోని అధిక మ్యుటేషన్ల కారణంగా.. ఇది కొవిడ్ వైరస్ ప్రవర్తనపై ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు. దీని ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు మరిన్ని వారాలు పడుతుందని తెలిపారు. ఈ వేరియంట్ సోకిన వారి రక్త నమూనాలను పరీక్షించగా.. వైరల్ లోడ్ ‘చాలా ఎక్కువ’గా ఉన్నట్లు తెలిసిందని ఎపిడెమిలాజిస్ట్ ఎరిక్ ఫీగెల్ డింగ్ వెల్లడించారు. దీని వల్ల దక్షిణాఫ్రికాలో పాజిటివిటీ రేటు ఒక్క వారంలోనే 1శాతం నుంచి 30శాతానికి పెరిగిందని చెప్పారు. కొత్త రకంలోని మ్యుటేషన్ల కారణంగా ఈ వేరియంట్ మునుపటి రకాల కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని లండన్కు చెందిన మరో ఎపిడెమిలాజిస్ట్ నీల్ ఫెర్గ్యూసన్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ దేశాల ఆంక్షలు..
కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికే యూకే, ఇజ్రాయెల్ వంటి దేశాలు.. దక్షిణాఫ్రికా, బోట్స్వానా సహా మరో నాలుగు ఆఫ్రికా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియా కూడా ప్రయాణికులకు మళ్లీ కఠిన క్వారెంటైన్ నిబంధనలు అమలు చేసే పనిలో పడింది. ఇటు భారత్ కూడా కొత్త వేరియంట్పై రాష్ట్రాలను హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!