కొవిడ్ టీకా: ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..!
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు అత్యవసర వినియోగం కింద అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఫైజర్ టీకా తీసుకున్న పదిరోజులకు ఓ అమెరికన్ నర్సుకు కరోనా పాజిటివ్గా తేలింది. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న మరికొందరిలోనూ వైరస్ బయటపడినట్లు అమెరికా వైద్యులు గుర్తించారు. ఈ ఘటనలతో కొందరిలో ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఇలాంటి కేసులు సహజమేనని.. ఇది ఊహించినదేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో రోగనిరోధకత(ఇమ్యూనిటీ) పెరగడానికి ఎన్నిరోజుల సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే వైరస్ నుంచి రక్షణ కలుగుతుందనే భావన కొందరిలో ఉంది. అయితే, కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నాక శరీరంలో దాని ప్రభావం చూపేందుకు పది నుంచి 14రోజుల సమయం పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అప్పుడు కూడా కేవలం 50శాతానికి పైగా మాత్రమే రోగనిరోధకత వస్తుందని..రెండో డోసు తీసుకున్న తర్వాతే పూర్తి రోగనిరోధకత వస్తుందని స్పష్టంచేస్తున్నారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్కు కారణమయ్యే వైరస్ను గుర్తించి రోగ నిరోధక శక్తిని సంసిద్ధం చేయడంలో తొలి డోసు ఉపయోగపడుతుందని.. ఇక వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాకుండా ఆ రోగనిరోధక శక్తిని మరికొన్ని నెలల పాటు కొనసాగించడం రెండో డోసు తర్వాతే లభిస్తుందని అంటున్నారు. కాలిఫోర్నియా నర్సు విషయంలో మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న రోజు లేదా మరుసటి రోజు వైరస్ సోకి ఉంటుందని.. అందుకే టీకా తీసుకున్న ఆరు రోజుల్లోనే లక్షణాలు బయటపడినట్లు నిపుణులు భావిస్తున్నారు. వ్యాక్సిన్ తన పని చేసేందుకు కావాల్సిన సమయం లభించకపోవడం వల్లే అలాంటి ఘటనలు జరుగుతాయని వివరిస్తున్నారు.
వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయంటే..!
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు శరీరంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో వ్యాక్సిన్లు దోహదం చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే, వివిధ వ్యాక్సిన్లు వేర్వేరు పనితీరును చూపించినప్పటికీ అన్ని టీకాల లక్ష్యం మాత్రం ఒక్కటే. శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు వాటిని గుర్తించి మెమొరీ కణాలుగా పిలిచే టీ-లింఫోసైట్స్, బీ-లింఫోసైట్లను సరఫరా చేయడమే వాటి కర్తవ్యం. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నాక ఈ కణాలను ఉత్పత్తి చేసేందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. వ్యాక్సిన్ నుంచి రక్షణ పొందేందుకు సాధారణంగా 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని అమెరికా సీడీసీ నిపుణులు క్రిష్టియన్ రామర్స్ స్పష్టంచేశారు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఒక్కోసారి వైరస్ లక్షణాలు బయటపడుతాయని పేర్కొన్నారు. ఇక మరికొన్ని సార్లు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధకత పెరుగుతున్న సమయంలోనూ జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరం రోగనిరోధకతను వృద్ధి చేసుకుంటోందనడానికి గుర్తుగా ఆ లక్షణాలను భావించాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ ప్రయోగాల్లో భాగంగా, తొలి డోసు తీసుకున్న తర్వాత ఇస్ట్రాజెనెకా-70శాతం, ఫైజర్-82శాతం, మోడెర్నా-92శాతం సమర్థత చూపించినట్లు వెల్లడించాయి. రెండో డోసు తీసుకున్నాక దాదాపు 95శాతం సమర్థత చూపించాయని ప్రకటించాయి. ఇక తీవ్ర కేసుల్లో మాత్రం వందశాతం రక్షణ కల్పిస్తాయని ఆయా సంస్థలు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో వెల్లడించాయి. అందుకే వ్యాక్సిన్ తీసుకునేవారు కచ్చితంగా రెండు డోసులను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి..
వ్యాక్సిన్... అలా మొదలైంది..!
వైరస్ సోకిన వారూ టీకా తీసుకోవాలి..!
కరోనా టీకా: ఇవి తెలియాలి మరి!
కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1700 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు