బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ నిబంధన.. వెనక్కి తీసుకున్న భారత్
విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో భారత్, బ్రిటన్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకుని తమ దేశానికి
దిల్లీ: విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో భారత్, బ్రిటన్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసులు వేసుకుని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు బ్రిటన్ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం కూడా ఆ దేశ పౌరులపై విధించిన క్వారంటైన్ ఆంక్షలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది.
అసలేం జరిగిందంటే..
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాకు గుర్తింపునివ్వడానికి బ్రిటన్ తొలుత నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ విమర్శలు గుప్పించడంతో.. కొవిషీల్డ్ను గుర్తింపు పొందిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చిన యూకే.. క్వారంటైన్ నిబంధనల నుంచి మాత్రం భారతీయులకు మినహాయింపు ఇవ్వలేదు. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంపై రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. బ్రిటన్ చర్యకు ప్రతిచర్య చేపట్టిన భారత్.. ఆ దేశానికి గట్టి ఝలకే ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. భారత్లో అడుగుపెట్టే బ్రిటన్ పౌరులంతా 10 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు యూకే ప్రయాణికులకు ప్రయాణ మార్గదర్శకాలను సవరిస్తూ అక్టోబరు 1న ఆదేశాలు జారీ చేసింది.
దీంతో కంగుతిన్న బ్రిటన్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్ రెండు డోసులు వేసుకుంటే క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదంటూ వెంటనే ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 11 నుంచి నూతన నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీంతో భారత్ శాంతించింది. యూకే ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ అక్టోబరు 1న విడుదల చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ ఏడాది ఫిబ్రవరి 17న జారీ చేసిన మార్గదర్శకాలే యూకే పౌరులకు కూడా వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని