కట్నం తీసుకున్నారా?అయితే ప్రభుత్వానికి లెక్క చెప్పండి!
వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు సమర్పించాల్సి ఉంది.
లఖ్నవూ: వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ పేరిట నోటీసులు జారీ చేశారు.
ఏ ఏడాదిలో వివాహం జరిగింది? ఎటువంటి పరిస్థితుల్లో కట్నం తీసుకోవాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానాలివ్వాలని నోటీసుల్లో ఉంది. 2004 ఏప్రిల్ తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా ఈ వాంగ్మూల పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఇవ్వకపోతే అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్టోబర్లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఆ వివరాలను సమర్పించాలన్నారు. అయితే, గతంలో ఆస్తుల వివరాలను తీసుకున్నారని, ఇప్పుడు వరకట్నం వివరాలుకోరడంపై ఉద్యోగవర్గాలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి.
సాంఘిక దురాచారమైన వరకట్న వ్యవస్థను నిర్మూలించడానికి యూపీ ప్రభుత్వం 1999లో వరకట్న నిషేధ చట్టం రూపొందించింది. 2004 మార్చి 31న ఈ చట్టానికి సవరణ చేసింది. అందులోని రూల్ 5 ప్రకారం.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో చేరే సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని వాంగ్మూల పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!