Google: గూగుల్ 23వ వార్షికోత్సవం నేడు.. ప్రత్యేక ‘డూడుల్’ చూశారా!
అంతర్జాలంలో ఏదైనా వెతకాలంటే ముందుగా మనకు గుర్తొచ్చే సెర్చ్ ఇంజన్లలో ‘గూగుల్’ ఒకటి. ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ సంబంధిత సేవలతో దూసుకెళ్తున్న ఈ అమెరికన్ సంస్థ.. సోమవారం 23వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని...
కాలిఫోర్నియా: అంతర్జాలంలో ఏదైనా వెతకాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ‘గూగుల్’. ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ సంబంధిత సేవలతో దూసుకెళ్తున్న ఈ అమెరికన్ సంస్థ.. సోమవారం 23వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కంపెనీ తన హోమ్పేజీలో ఉంచిన కేక్ ‘డూడుల్’ నెటిజన్లను ఆకట్టుకుంటోంది! కేకు ఉంచి, గూగుల్ ఆంగ్ల అక్షరమాలలో ‘ఎల్’ అక్షరాన్ని ఆ కేకుపై కొవ్వొత్తిలా కనిపించేలా దీన్ని రూపొందించారు. దీంతోపాటు 23వ వార్షికోత్సవానికి సూచికగా కేకుపై 23 అని ఉంది. ‘ఒక్క అవకాశం జీవితాన్నే మార్చుతుందని అంటారు. అదే గూగుల్ విషయంలో ఇద్దరు కంప్యూటర్ శాస్త్రవేత్తలు కలిసి మొత్తం ఇంటర్నెట్ గమనాన్ని, లక్షలాది జీవితాలను మార్చారు. హ్యాపీ బర్త్డే గూగుల్!’ అని రాసుకొచ్చారు.
150కు పైగా భాషల్లో..
అమెరికాకు చెందిన లారీ పేజ్, సర్జీ బ్రిన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1998 సెప్టెంబరు 4న ఈ సంస్థను స్థాపించారు. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ సంస్థ.. నేడు వరల్డ్ టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. రోజూ ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా భాషల్లో బిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. 20కి పైగా డేటా సెంటర్లు నిరంతరాయ సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థకు 2015లో భారత్కు చెందిన సుందర్ పిచాయ్ సీఈఓగా నియమితులైన విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గూగుల్ మొదటి ఏడేళ్లు సెప్టెంబరు 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్ 27కి మార్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు