Cyber Attack: కొవిడ్ వేళ కోకొల్లలుగా సైబర్ దాడులు
కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్ నేరాలు
గత ఏడాది 151% పెరుగుదల నమోదైందన్న డబ్ల్యూఈఎఫ్
దావోస్, దిల్లీ: కొవిడ్ మహమ్మారి విజృంభణ వేళ ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2021లో ఈ సైబర్ నేరాలు, రాన్సమ్వేర్ దాడుల సంఖ్య రికార్డు స్థాయిలో 151 శాతం పెరిగింది. ‘అంతర్జాతీయ సైబర్ భద్రత రూపురేఖలు- 2022’ పేరుతో దావోస్ ఎజెండా సదస్సులో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పలు కీలక అంశాలను బయటపెట్టింది.
*కొవిడ్ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలీకరణం చెందింది. అయితే అదే సమయంలో సైబర్ నేరాలూ పెరిగాయి.
* సైబర్ దాడులను గుర్తించి, వాటిపై స్పందించేందుకు ఒక్కో కంపెనీకి సగటున 280 రోజుల సమయం పడుతోంది.
*రాన్సమ్వేర్లు ప్రజా భద్రతకు ప్రమాదకరమన్నది దాదాపు 80% సైబర్ నిపుణుల అభిప్రాయం.
*గత ఏడాది సైబర్ దాడి కారణంగా ఒక్కో పెద్ద కంపెనీకి సగటున రూ.27 కోట్ల నష్టం వాటిల్లింది.
* సైబర్ దాడికి గురయ్యాక ఆరు నెలల వరకూ ఒక్కో కంపెనీ షేర్ ధర దాదాపు 3% తగ్గింది.
ప్రభుత్వాలపై సన్నగిల్లిన విశ్వాసం
దావోస్, దిల్లీ: కొవిడ్ ఉద్ధృతి వేళ గత ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని ఓ సర్వే తేల్చింది. అదే సమయంలో బూటకపు వార్తల పట్ల ఆందోళనలు మునుపెన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరాయని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) దావోస్ ఎజెండా సదస్సులో విడుదలైన ‘ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్’ నివేదికతో ఈ మేరకు పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
* తప్పుడు సమాచారం, బూటకపు వార్తలను ఇతరులు తమ ఆయుధాలుగా ఉపయోగించుకునే ముప్పుందని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 76% మంది ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో 82% మంది ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్, జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీల్లో ప్రజలు బూటకపు వార్తలపై పెద్దగా ఆందోళన వెలిబుచ్చలేదు.
* స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు, మీడియాపై ప్రజల్లో సగటు విశ్వాస శాతం పరంగా చూస్తే.. ఆ జాబితాలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. రష్యా అట్టడుగున ఉంది.
* ఆర్థిక ఆశావాదం విషయంలో భారత్ టాప్-5లో చోటుదక్కించుకుంది.
* భారత్లో వ్యాపారాలు, ప్రభుత్వం, మీడియాపై విశ్వాసం తగ్గగా.. స్వచ్ఛంద సంస్థల విషయంలో అది స్థిరంగా ఉంది.
* మొత్తం 28 దేశాల్లో సర్వే నిర్వహించగా.. 23 దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలతో పోలిస్తే వ్యాపారాల మీదే ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!