Lockdown: ‘లాక్డౌన్’.. డౌన్ డౌన్.. కొవిడ్ నిబంధనలపై వివిధ దేశాల్లో నిరసనలు
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఓవైపు కొవిడ్ విజృంభిస్తుండగా.. మరోవైపు అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న లాక్డౌన్ వంటి నిబంధనలను
నెదర్లాండ్స్లో కాల్పులు.. ఏడుగురికి గాయాలు
వియన్నా: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఓవైపు కొవిడ్ విజృంభిస్తుండగా.. మరోవైపు అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న లాక్డౌన్ వంటి నిబంధనలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఐరోపా దేశాల్లో ఇలాంటి నిరసనలు పెరుగుతున్నాయి. కొవిడ్ నాలుగో ఉద్ధృతి తీవ్రంగా ఉన్న ఆస్ట్రియాలో సోమవారం నుంచి దేశవ్యాప్త లాక్డౌన్కు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు 35 వేల మంది రాజధాని నగరమైన వియన్నాలో శనివారం ప్రదర్శనలు చేపట్టారు. దీంతో 1,300 మంది పోలీసు అధికారులు బందోబస్తు చేపట్టారు. నిరసనకు దిగిన చాలామంది మాస్కులు కూడా ధరించలేదు. లాక్డౌన్ వంటి నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారంతా అంటున్నారు. అలాగే స్విట్జర్లాండ్, క్రొయేషియా, ఇటలీల్లోనూ కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
* నెదర్లాండ్స్లో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రోటర్డ్యామ్ నగరంలో శుక్రవారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు నిరసనకు దిగడంతో డచ్ పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడ్డారు. బ్రెడా నగరంలోనూ వందల సంఖ్యలో ప్రజలు నిరసన చేపట్టారు.
* పలు ఐరోపా దేశాల్లో టీకాలు తీసుకున్నవారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ.. తీసుకోనివారికి నిబంధనలు అమలు చేయడంతో ఓ రకమైన సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారిని కొన్ని దుకాణాలు, మాల్స్లోకి అనుమతించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. స్లోవేకియాలో వ్యాక్సిన్
తీసుకోని వారికి పలు దుకాణాలు, మాల్స్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. వీరు ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి అనుమతి లేదు. అలాగే పనుల్లోకి వెళ్లాలంటే వారంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనలు విధించారు. గ్రీస్లోనూ టీకా తీసుకోనివారికి పలు నిబంధనలు అమలవుతున్నాయి.
ఆస్ట్రేలియాలో కొత్త చట్టంపై నిరసనలు..
కరోనా కట్టడికి ఆస్ట్రేలియాలో ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్య నిర్వహణలో ఆరోగ్య మంత్రికి విస్తృత అధికారాలను కట్టబెట్టడం, ఓ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఇవ్వడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. దీన్ని వ్యతిరేకిస్తూ మెల్బోర్న్ నగరంలో జనం భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. వేల మంది పార్లమెంటు హౌస్ వద్ద నిరసన తెలిపారు. అయితే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.అమెరికాలో బూస్టర్ డోస్ ప్రారంభం..
వాషింగ్టన్: అమెరికాలో ప్రజలకు కొవిడ్ టీకా బూస్టర్ డోస్ను శుక్రవారం ప్రారంభించారు. శీతాకాలంలో కరోనా కేసులు పెరగకుండా ఈమేరకు చర్యలు చేపట్టారు. 50 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోసు తప్పక తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇంతవరకు అమెరికాలో బూస్టర్ డోసు వేయడానికి సంబంధించి కొన్ని అంశాల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కొత్త నిబంధనలను రూపొందించింది. ఈమేరకు 18 ఏళ్లు పైబడిన వారంతా ఫైజర్ లేదా మోడెర్నా టీకాకు
సంబంధించి.. చివరి డోసు వేయించుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు. ఒకే డోసుతో కూడిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకా విషయంలో బూస్టర్ డోసుకు 2 నెలల వ్యవధి సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ మూడు విషయాలే ఆరోగ్యకర జీవన రహస్యం.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
ఆరోగ్యకరమైన జీవనానికి ఏం చేయాలో ఓ డాక్టర్ చెబుతున్న సీక్రెట్ ఫార్ములా వీడియోను హర్ష గోయెంకా ఎక్స్లో షేర్ చేశారు.