128 చదరపు అడుగుల ఫ్లాటు.. ధర రూ.6 కోట్ల పైమాటే
400 చదరపు అడుగుల ఇల్లంటే... ఇంత ఇరుకా అనుకుంటాం. అలాంటిది కేవలం 128 చదరపు అడుగుల్లోనే నివసించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?
మైక్రో, నానోఫ్లాట్లలోనే సగం మంది జీవనం
ఆకాశహర్మ్యాల నగరం హాంకాంగ్లో జీవన వైచిత్రి
హాంకాంగ్: 400 చదరపు అడుగుల ఇల్లంటే... ఇంత ఇరుకా అనుకుంటాం. అలాంటిది కేవలం 128 చదరపు అడుగుల్లోనే నివసించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకాశహర్మ్యాల నగరం హాంకాంగ్లో ఎక్కడచూసినా ఇలాంటి బుల్లి ఫ్లాట్లే! అలాగని వీటి ధరలేమీ తక్కువ కాదు. ఈ బుల్లి ఇంటిని సొంతం చేసుకోవాలంటే... కనీసం రూ.6 కోట్లు పెట్టాల్సిందే.
220 చదరపు అడుగుల ఇల్లు అనగానే... ‘వావ్! ఇంత విశాలమైన ఇల్లా’ అని హాట్ కేకుల్లా కొనేసుకుంటారు హాంకాంగ్లో. ఎందుకంటే ఇక్కడ 128 చదరపు అడుగుల (14.22 చదరపు గజాల) ఫ్లాట్లు కోకొల్లలు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో హాంకాంగ్ ఒకటి. దీని విస్తీర్ణం 1,106 చదరపు కిలోమీటర్లు. ఇందులో కేవలం 7% భూభాగమే నివాస ప్రాంతం. మిగతా భూభాగాన్ని కొండలకు, ప్రకృతి ఆవాసాలకు, పార్కులకు విడిచిపెట్టారు. ఇక ఇక్కడి ప్రస్తుత జనాభా సుమారు 75 లక్షలు. ఒక్క చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 49 వేల మంది నివసిస్తున్నారు. తక్కువ స్థలంలో నివసించే జీవనశైలికి 1960ల్లోనే ఇక్కడ బీజం పడింది. జనాభా పెరుగుతుండటంతో, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను ముందే ఊహించిన అప్పటి హాంకాంగ్ గవర్నర్ లార్డ్ మాక్లెహోస్...
75% భూభాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నివాసేతర ప్రాంతంగానే ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ ఆకాశహర్మ్యాలు వెలిశాయి. కారు నిలపడానికి అవసరమైన దానికంటే తక్కువ స్థలంలో సొంత ఫ్లాట్ దొరికితే చాలు... మహద్భాగ్యమే ఇక్కడ!
సూక్ష్మ గృహోద్యమంతో...
‘నీకు సొంతిల్లు లేదంటే... అది నీ సమస్యే’ అన్న భావన హాంకాంగ్లో అత్యంత బలంగా ఉంది. దీంతో కనీసం ఒక్క ఫ్లాట్ అయినా కొనుక్కోవాలన్న లక్ష్యం అందరిలోనూ కనిపిస్తుంది. ఈ డిమాండుకు తగ్గట్టు సూక్ష్మ గృహోద్యమం పుట్టుకొచ్చి... 128, 168, 220 తదితర చదరపు అడుగుల నానోఫ్లాట్లతో కూడిన టవర్ల నిర్మాణం ఊపందుకొంది. కరోనాకు ముందు 2019లో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్నప్పుడు... ఇలాంటి సుమారు 8,500 ఫ్లాట్లు చటుక్కున అమ్ముడుపోయాయి.
లోపల ఏమేం ఉంటాయి?
సగటు ఇంటి విస్తీర్ణంతో పోలిస్తే, దానికి సగం స్థలంలో నిర్మించిన ఇళ్లను మైక్రోఫ్లాట్స్ అంటారు. ఇవి సుమారు 290 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉండేవాటిని నానోఫ్లాట్స్ అంటారు. ఆధునిక వసతులతో వీటిని అత్యంత సౌకర్యవంతంగా నిర్మిస్తారు. అక్కడికక్కడే ఒక మంచం, అర, మరుగుదొడ్డి, కిచెన్ ఉంటాయి. బాత్రూంలో కుండీపైనే స్నానం చేయడానికి అవసరమైన షవర్ను అమర్చేస్తారు. కిచెన్లో ఇన్బిల్ట్గా మైక్రోవోవెన్ ఉంటుంది.
కనిపించని అసంతృప్తి...
మైక్రో, నానో ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా హాంకాంగ్ సర్కారు కూడా గృహనిర్మాణ నిబంధనలను ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తోంది. జనాభాలో దాదాపు సగం మందికి సొంత మైక్రో, నానోఫ్లాట్లు ఉన్నాయి. అద్దెకు ఇచ్చేందుకు మాత్రం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తుంటారు. ఇలాంటి వాటిలో వేల మంది జీవనం సాగిస్తున్నారు. మిగతా దేశాలవారితో పోల్చితే తాము అత్యంత చిన్న గదుల్లో జీవిస్తున్నామన్న అసంతృప్తి ఇక్కడివారిలో అంతగా కనిపించడంలేదు. పైగా, కుటుంబం పెద్దదయ్యేకొద్దీ పెద్ద ఇళ్లలోకి వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు!
కోట్లు గుమ్మరించాల్సిందే
హాంకాంగ్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. 128 నుంచి 288 చదరపు అడుగుల ఫ్లాట్ల ఖరీదు... సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకూ ఉంటున్నాయి.
- 2010 నుంచి ఇక్కడ సొంతిళ్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో 2019 నాటికి ఫ్లాట్ల ధరలు ఏకంగా 187% మేర ఎగబాకాయి.
- గంటకు రూ.360 (4.82 డాలర్లు) కనీస సంపాదన ఉండే నగరంలో సగటు ఇంటి ఖరీదు రూ.9.66 కోట్లు (1.3 మిలియన్ డాలర్లు).
- ఆ లెక్కన అత్యంత నిపుణుడైన ఉద్యోగి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిని సొంతం చేసుకోవడానికి... కనీసం 21 సంవత్సరాలు పనిచేయాల్సిందేనని ఓ అధ్యయనం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం. -
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!