Covid Vaccine: టీకా స్వచ్ఛందం కాదు.. నిర్బంధం!
దేశంలో వయోజనులంతా కొవిడ్ టీకా తీసుకోవాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్బంధమేమీ, అంతా స్వచ్ఛందమేనని స్పష్టంచేస్తోంది.
తప్పనిసరి చేస్తున్న స్థానిక సంస్థలు, కంపెనీలు
లోకల్ సర్కిల్స్ సర్వేలో 26% మంది వెల్లడి
దిల్లీ: దేశంలో వయోజనులంతా కొవిడ్ టీకా తీసుకోవాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో నిర్బంధమేమీ, అంతా స్వచ్ఛందమేనని స్పష్టంచేస్తోంది. ఇదే విషయాన్ని అక్టోబరు 8న బాంబే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లోనూ పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా పలు స్థానిక సంస్థలు, సంఘాలు, కంపెనీలు మాత్రం తమ పరిధిలోని వారంతా టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వేలో.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఇదే విషయం చెప్పారు. సర్వే కోసం 328 జిల్లాల్లో 36 వేల మంది అభిప్రాయాలను సేకరించగా.. 26% మంది తమ స్థానిక ప్రభుత్వాలు టీకాను తప్పనిసరి చేశాయని వెల్లడించారు. 29% మంది తమ కాలనీ/మార్కెట్/సొసైటీలలో అందరికీ టీకా తప్పనిసరి చేశారని, ధ్రువీకరణ పత్రం కూడా చూపమంటున్నారని చెప్పారు. కంపెనీలు, ఉద్యోగుల యాజమాన్యాలు కూడా ఇదే వైఖరితో ఉన్నట్టు 40% మంది తెలిపారు. మరో 13% మంది మాత్రం తమ యాజమాన్యాలు టీకా తప్పక వేసుకోవాలని చెబుతున్నా బలవంతం చేయడం లేదన్నారు. అలాగే కొన్నిచోట్ల స్థానిక పరిపాలనాధికారులు.. టీకా వేసుకోని పౌరులకు కొన్ని ప్రయోజనాలను ఆపేస్తున్నట్టు కూడా సర్వేలో తేలింది. ఉదాహరణకు.. ఔరంగాబాద్ జిల్లాలో ఒక్క డోసు టీకా కూడా తీసుకోనివారికి రేషన్ దుకాణాలు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ పంపుల్లో సేవలు బంద్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ సైతం.. టీకా వేసుకోని ఉద్యోగులు, అధికారులు జీతాలు ఆపేస్తామని ఏకంగా ఉత్తర్వులిచ్చింది. టీకా విషయంలో ప్రజల్ని చైతన్యపరచాలే తప్ప ఎలాంటి బలవంతం చేయకూడదన్న కేంద్రం వైఖరిపైనా తమకు అవగాహన ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో ఎక్కువమంది చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకుంటేనే బస్సులోకి అనుమతి ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ తాజా నిర్ణయం
ఠాణె: కరోనా వ్యాక్సిన్ వేయించుకోని తమ సిబ్బందికి జీతాలు చెల్లించేది లేదని ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) తాజాగా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని ప్రజలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించేది లేదని స్పష్టంచేసింది. నవంబరు చివరి నాటికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సిన్ తీసుకోని వారు కనిపిస్తే వెంటనే సమీప కేంద్రంలో వారికి టీకాలు వేయిస్తాం. టీకాలు తీసుకున్న వారు బస్సుల్లో ప్రయాణించాలంటే తమ వెంట వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకువెళ్లాలి. లేదంటే వారిని బస్సులోకి అనుమతించబోం’’ అని టీఎంసీ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్