Covaxin: కొవిడ్ తీవ్ర లక్షణాలు సోకకుండా కొవాగ్జిన్తో 93.4 శాతం రక్షణ
దేశీయంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్.. కొవిడ్ తీవ్ర లక్షణాల నుంచి 93.4 శాతం కాపాడే సామర్థ్యాన్ని కనబరిచిందని
హైదరాబాద్: దేశీయంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్.. కొవిడ్ తీవ్ర లక్షణాల నుంచి 93.4 శాతం కాపాడే సామర్థ్యాన్ని కనబరిచిందని ప్రముఖ జర్నల్ లాన్సెట్ కథనం వెల్లడించింది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన ఫలితాలను జర్నల్లో ప్రచురించారు. ఈ కథనం ప్రకారం.. ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో 0.5 శాతం కంటే తక్కువ మందిలో మాత్రమే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తాయి.
ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రబలరూపకంగా ఉన్న డెల్టా వేరియంట్ నుంచి 65.2 శాతం కాపాడగలిగే సామర్థ్యం కొవాగ్జిన్కు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణలో తేలింది. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. అన్ని రకాల కొవిడ్ స్ట్రైన్స్ నుంచి 70.8 శాతం రక్షణ ఇస్తుంది.
కొవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల్లో దేశవ్యాప్తంగా 25 వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 25,800 మంది పాల్గొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ నిమిత్తం భారత్లో జరిగిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్స్ ఇదేనని భారత్ బయోటెక్ తెలిపింది. కొవాగ్జిన్ సామర్థ్యం, క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన ఫలితాలు దాదాపు 10 కీలక జర్నల్స్లో ప్రచురితమైనట్లు కంపెనీ ఛైర్మన్ కృష్ణ ఎల్ల తెలిపారు. దీంతో ప్రపంచంలో అత్యధిక జర్నల్స్లో ప్రచురితమైన టీకాల్లో ఒకటిగా కొవాగ్జిన్ నిలిచిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల నుంచి సహకారం అందడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. కొవాగ్జిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 10 నెలల వ్యవధిలో ఈ ఘనత సాధించడం ఆత్మనిర్భర్ భారత్ శక్తిని తెలియజేస్తోందన్నారు.
కొవాగ్జిన్ను అత్యవసర వినియోగ టీకాల జాబితాలో డబ్ల్యూహెచ్ఓ ఇటీవలే చేర్చిన విషయం తెలిసిందే. దీంతో వివిధ దేశాల్లో ఈ టీకా వినియోగానికి మార్గం సుగమమైంది. అంతకంటే ముందే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50కి పైగా దేశాల్లో ఈ టీకా వినియోగానికి ఆయా నియంత్రణా సంస్థలు అనుమతినిచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.