Cop26: భూతాపం నుంచి ద్వీప దేశాలను రక్షించేందుకు ‘ఐరిస్’
వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతులను కల్పించేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం...
‘కాప్26’ సదస్సులో ప్రారంభించిన మోదీ
గ్లాస్గో: వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతులను కల్పించేందుకు భారత్ ప్రతిష్ఠాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెజీలియంట్ ఐలాండ్ స్టేట్స్’ (ఐరిస్) అనే ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బ్రిటన్లోని గ్లాస్గోలో వాతావరణ సదస్సు (కాప్26) వేదిక వద్ద లాంఛనంగా ప్రారంభించారు. వాతావరణ మార్పులతో పెను ముప్పును ఎదుర్కొంటున్న ఈ దేశాలకు దీని వల్ల మేలు జరుగుతుందని, కొత్త ఆశలను చిగురింపజేస్తుందని ఆకాంక్షించారు. ఆ దేశాలకు ఎంతో కొంత సాయం చేస్తున్నామన్న సంతృప్తిని ఇది మిగిలిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్లు హాజరయ్యారు.
‘‘కొన్ని దశాబ్దాలుగా వాతావరణ మార్పుల ప్రభావం ఎవరినీ విడిచిపెట్టడం లేదు. అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాల (ఎస్ఐడీఎస్)కు అది జీవన్మరణ సమస్యగా మారింది. ఆ ప్రాంతాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అక్కడ ప్రజల ప్రాణాలకే కాక ఆర్థిక వ్యవస్థలకూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆ దీవులకు పర్యాటక రంగమే ఆధారం. అయితే విపత్తులకు జడిసి అక్కడికి వెళ్లడానికి పర్యాటకులు వెనుకడుగు వేస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా కొందరి స్వార్థం వల్ల ప్రకృతికి సంబంధించిన వికృత రూపం తెరపైకి వచ్చింది. దీనివల్ల అభం శుభం తెలియని చిన్న ద్వీప దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి’’ అని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు.
ఇస్రో ద్వారా విపత్తు సమాచారం
‘విపత్తును ఎదుర్కొనే మౌలిక వసతుల కూటమి’ (సీడీఆర్ఐ)ని ప్రధాని ఈ సందర్భంగా అభినందించారు. పసిఫిక్ దీవులు, కారికోమ్ దేశాలతో సహకారం కోసం భారత్ ప్రత్యేక ఏర్పాటు చేసిందన్నారు. ఉపగ్రహాల సాయంతో సకాలంలో తుపాను హెచ్చరికలు చేయడానికి, పగడపు దిబ్బలు, తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ వివరాలను ఆయా దేశాలకు అందిస్తామని చెప్పారు. ఐరిస్ను ప్రారంభించిన మోదీని బ్రిటన్ ప్రధాని జాన్సన్ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామన్నారు.
భారత వ్యతిరేక శక్తులను కట్టడి చేయాలి
కాప్26 సదస్సు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మధ్య జరిగిన స్వల్పకాల చర్చల్లో.. ఉగ్రవాదంపై పోరు, కొన్ని వేర్పాటువాద సంస్థలు సాగిస్తున్న అతివాద కార్యకలాపాలు సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత వ్యతిరేక వేర్పాటువాద ముఠాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని జాన్సన్ పేర్కొన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే అంశంపై ఈ స్వల్ప భేటీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదని శ్రింగ్లా తెలిపారు. ఈ అంశంపై ఇరు దేశాల భద్రత సలహాదారులు బుధవారం భేటీ కానున్నట్లు వెల్లడించారు.
ఏమిటీ ఐరిస్?
సీఆర్డీఐలో భాగంగా ఐరిస్ను చేపట్టారు. దీనికింద చిన్న ద్వీప దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో తలెత్తే ముప్పులపై మదింపు వేస్తారు. వీటిని తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణం, సామర్థ్య పెంపునకు ఆర్థిక వనరుల సమీకరణకు తోడ్పాటు అందిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య సహకారం వల్ల ఇది సాధ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’