Amarinder Singh: ఆమెతో ఉన్నోళ్లంతా ఐఎస్‌ఐ ఏజెంట్లా? 

పాకిస్థానీ పాత్రికేయురాలు అరూసా ఆలంతో తన స్నేహంపై దుమారం చెలరేగుతుండటంతో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి 

Updated : 26 Oct 2021 12:12 IST

సోనియా, సుష్మ తదితరులతో అరూసా ఫొటోలు 
విడుదల చేసిన అమరీందర్‌ సింగ్‌

చండీగఢ్‌: పాకిస్థానీ పాత్రికేయురాలు అరూసా ఆలంతో తన స్నేహంపై దుమారం చెలరేగుతుండటంతో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, యశ్వంత్‌ సిన్హా, ఉత్తర్‌ ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయంసింగ్‌ యాదవ్, సినీ ప్రముఖులు శత్రుఘ్న సిన్హా, దిలీప్‌ కుమార్, మహేశ్‌ భట్‌ తదితరులతో అరూసా ఉన్న ఫొటోలను సోమవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. ఫొటోల్లో ఆమెతో ఉన్నవారంతా పాక్‌ గూఢచర్య సంస్థ- ఐఎస్‌ఐ ఏజెంట్లేనా అని ప్రశ్నించారు. భారత్, పాకిస్థాన్‌ మధ్య ప్రస్తుతం వీసాల నిషేధం అమల్లో లేకపోయి ఉంటే తాను అరూసాను మళ్లీ మన దేశానికి ఆహ్వానించేవాడినని అమరీందర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని