women police: మహిళా కానిస్టేబుళ్ల పని గంటల తగ్గింపు
ఎంత లాఠీ చేతబట్టి ఖాకీ దుస్తుల్లోకి మారినా.. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే నానుడి మహిళా పోలీసులకు కూడా వర్తిస్తుందని మహారాష్ట్ర పోలీసు
ముంబయి: ఎంత లాఠీ చేతబట్టి ఖాకీ దుస్తుల్లోకి మారినా.. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే నానుడి మహిళా పోలీసులకు కూడా వర్తిస్తుందని మహారాష్ట్ర పోలీసు విభాగం గుర్తించింది. వృత్తి జీవితాన్ని, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునేలా మహిళా కానిస్టేబుళ్ల పనివేళలను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని నాగ్పుర్, అమరావతి నగరాలతోపాటు పుణె గ్రామీణ విభాగంలో గత నెల ప్రయోగాత్మకంగా అమలుచేసిన ఈ నూతన విధానాన్ని రాష్ట్రమంతా పాటించేలా డీజీపీ సంజయ్ పాండే ఆమోదం తెలిపారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్నప్పటికీ మహిళా కానిస్టేబుళ్లకు ఇంటిపరంగా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నెలరోజుల కిందట తాము ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టిన ఆలోచనకు పెద్దఎత్తున స్పందన వచ్చినట్లు ఓ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఈ విధానానికి నాగ్పుర్ పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ మొట్టమొదటిసారి ఆగస్టు 28న శ్రీకారం చుట్టారు. వెసులుబాటు కల్పించాక మహిళా కానిస్టేబుళ్లు తమ పిల్లలకు, కుటుంబసభ్యులకు కొంత సమయం ఇవ్వగలుగుతున్నట్లు అధికారి వెల్లడించారు. పైగా పనిగంటలు తగ్గించాక మహిళా కానిస్టేబుళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారని అమరావతి నగర పోలీస్ కమిషనర్ ఆర్తీసింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని