Pichai: ఇంటర్నెట్పై పలు దేశాల్లో దాడి
ఇంటర్నెట్ పలు దేశాల్లో దాడికి గురవుతోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు.
బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఇంటర్నెట్ విచ్ఛిన్నతకు ఎదురు నిలవాలి
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిలుపు
లండన్: ఇంటర్నెట్ పలు దేశాల్లో దాడికి గురవుతోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు.. అంతర్జాల విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను తీసుకొచ్చిన క్రమంలో- ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నిబంధనలు ఇబ్బందికరంగా పరిణమించాయంటూ.. కొన్ని సామాజిక మాధ్యమాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో బీబీసీ ఇంటర్వ్యూలో పిచాయ్ పలు వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రతి దేశంలో ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలను అనుమతించాలన్న దానిపై చర్చ జరుగుతోంది. సమాచార ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. కొన్నిచోట్ల ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బలమైన ప్రజాస్వామ్య మూలాలు, విలువలు ఉన్న దేశాలు.. ఇంటర్నెట్ విచ్ఛిన్నతకు వ్యతిరేకంగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఉచిత, అనియంత్రిత అంతర్జాలం మంచిని ప్రోది చేసేందుకు తోడ్పడుతుంది. దీన్ని అడ్డుకోవడమంటే వెనక్కి వెళ్లడమే. నేను అమెరికా పౌరుణ్ని. కానీ, నాలో భారతీయ మూలాలు బలంగా పెనవేసుకుని ఉన్నాయి. భారతీయ ఆత్మ నాలో ఉంది’’ అని సుందర్ పిచాయ్ అన్నారు.
పాతికేళ్లలో అవే కీలకం: చైనాలో గూగుల్కు సంబంధించిన ప్రధాన ఉత్పత్తులేవీ అందుబాటులో లేవని పిచాయ్ చెప్పారు. వచ్చే పాతికేళ్లలో కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో సాధించే ప్రగతి.. ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకొస్తుందన్నారు. మనిషి అభివృద్ధి చేసిన గొప్ప సాంకేతికతలుగా ఇవి నిలుస్తాయని చెప్పారు. కృత్రిమ మేధ అంటే.. మానవ మేధస్సును యంత్రాల్లోకి చొప్పించి, అనేక రెట్లు దాన్ని వృద్ధిచేసి, పనిచేయించడమేనన్నారు. కృత్రిమ మేధో వ్యవస్థలు మనుషుల కంటే మిన్నగా సమస్యలను పరిష్కరిస్తున్నాయన్నారు. నిప్పు, విద్యుత్తు, ఇంటర్నెట్ నేడు ఎంత అవసరమో.. భవిష్యత్తులో కృత్రిమమేధ అంతకు మించి అవసరమవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!