‘అది.. కొవిడ్ కంటే ప్రమాదం’
ఇప్పటికే కరోనాతో బెంబేలెత్తిపోతున్న ప్రపంచాన్ని రోజుకో కొత్త రోగం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కుదిపేస్తుండగానే.. కొత్తగా జీ-4, బ్యుబోనిక్ ప్లేగు వంటివి ప్రజల్ని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి............
కజఖ్స్థాన్లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటన
కజఖ్స్థాన్: ఇప్పటికే కరోనాతో బెంబేలెత్తిపోతున్న ప్రపంచాన్ని రోజుకో కొత్త రోగం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా కుదిపేస్తుండగానే.. కొత్తగా జీ-4, బ్యుబానిక్ ప్లేగు వంటివి ప్రజల్ని మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా కజఖ్స్థాన్లో మరో కొత్త వ్యాధి బయటపడ్డట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం తెలిపింది. జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశంలోని చైనా పౌరుల్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాల్లోకి వెళితే..
కజఖ్స్థాన్లో గుర్తుతెలియని న్యుమోనియా వల్ల ఈ ఏడాది ఆరంభం నుంచి 1,772 మంది మరణించారు. ఇందులో 628 మంది ఒక్క జూన్లోనే మృత్యువాతపడ్డారు. వీరిలో చైనా పౌరులు కూడా ఉన్నారు. ఈ మేరకు అక్కడి చైనా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వీచాట్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త న్యుమోనియాతో బాధపడుతున్న వారిలో మరణాల రేటు కొవిడ్-19తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ కొత్త వ్యాధికి కొవిడ్-19తో పోలికలు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేనట్లు తెలుస్తోంది. కజఖ్ నుంచి చైనాలోకి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్తపడాలని చైనాలోని ఆరోగ్య నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. చైనాకు చెందిన ‘షిన్జియాంగ్ వీగర్’ అనే స్వయంప్రతిపత్తి గల ప్రాంతం కజఖ్స్థాన్తో సరిహద్దులు పంచుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే, ఈ న్యూమోనియాను చైనా రాయబార కార్యాలయం గుర్తు తెలియనిదిగా పేర్కొనడానికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు. కజఖ్స్థాన్ మాత్రం అధికారికంగా కేవలం న్యుమోనియాగా మాత్రమే పేర్కొంటోంది. దీనికి సంబంధించి చైనా వద్ద ఇంకా ఏమైనా లోతైన ఆధారాలు ఉన్నాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)కు సమాచారం ఇచ్చారా.. లేదా.. అన్న విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. కజఖ్లో ఉన్న చైనా పౌరులు అప్రమత్తంగా ఉండాలని.. కొత్త వ్యాధి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రమే రాయబార కార్యాలయం సూచించింది.
చైనాలో వస్తున్న మీడియా కథనాల ప్రకారం.. కజఖ్స్థాన్లో కొత్త రకం న్యుమోనియాతో బాధపడుతున్నవారు కొవిడ్-19 సోకిన వారి కంటే రెండు నుంచి మూడింతలు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కిసికోవా బుధవారం ప్రకటించారు. రోజుకి 300 మంది న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరుతున్నారని కిసికోవా వెల్లడించినట్లు కజఖ్కు చెందిన వార్తా సంస్థ కజిన్ఫామ్ తెలిపింది.
చైనాలో అంతర్భాగం కావడానికి కజఖ్స్థాన్ ఆసక్తిగా ఉందంటూ చైనాకు చెందిన ఓ వెబ్సైట్లో గత ఏప్రిల్లో వ్యాసం ప్రచురితమైంది. దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన కజఖ్ ప్రభుత్వం అక్కడి చైనా రాయబార కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడి రాయబార కార్యాలయం నుంచి తాజా ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం