పాక్కు చైనా డ్రోన్లు: ప్రిడేటర్లపై భారత్ ఆసక్తి
దాడి చేయగల నాలుగు డ్రోన్లను తన మిత్రదేశం పాకిస్థాన్కు చైనా సరఫరా చేయనుందని తెలిసింది. రెండు దేశాల ఆర్థిక నడవా, గ్వదర్ పోర్టు వద్ద డ్రాగన్ కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక స్థావరం భద్రతకు వీటిని ఉపయోగించనున్నారు.....
ముంబయి: దాడి చేయగల నాలుగు డ్రోన్లను తన మిత్రదేశం పాకిస్థాన్కు చైనా సరఫరా చేయనుందని తెలిసింది. రెండు దేశాల ఆర్థిక నడవా, గ్వదర్ పోర్టు వద్ద డ్రాగన్ కొత్తగా ఏర్పాటు చేసిన సైనిక స్థావరం భద్రతకు వీటిని ఉపయోగించనున్నారు. చైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ పాకిస్థాన్ ద్వారా వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే పాక్ ఈ డ్రోన్లను ఇతర అవసరాలకూ వినియోగించే ఆస్కారం లేకపోలేదు!
సైనిక అవసరాల కోసం వింగ్ లూంగ్ 2 డ్రోన్లను చైనా తయారుచేసింది. వీటినే పాకిస్థాన్ వైమానిక దళం ఉపయోగిస్తోంది. తాజాగా 48 జీజే-2 డ్రోన్లను ఉత్పత్తి చేయాలని బీజింగ్ తలపెట్టింది. ఇవి గాల్లోంచి నేలమీదకు ప్రయోగించగల 12 క్షిపణులు మోసుకెళ్లగలవు. ఆసియాలో చాలా దేశాలకు ఈ డ్రోన్లను చైనా విక్రయించింది. అయితే, ఇవి అనుకున్న మేరకు విజయవంతమైన దాఖలాలు కనిపించలేదు. గత రెండు నెలల కాలంలో లిబియాలో ఇలాంటివి నాలుగు డ్రోన్లు హఠాత్తుగా నేలకూలాయి.
పాకిస్థాన్కు చైనా డ్రోన్లను ఇస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరన్స్ (మేల్) సాయుధ ప్రిడేటర్-బి డ్రోన్లపై భారత్ ఆసక్తి కనబరుస్తోంది. ఇవి నిఘా పెట్టి సమాచారం సేకరించడమే కాకుండా క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబుల ద్వారా లక్ష్యాలను నాశనం చేయగలవు. ఆయుధ రహిత ప్రిడేటర్ల కోసం భారత నౌకదళం చర్చలు జరుపుతుండగా అన్ని అవసరాలు తీర్చగలిగేవి తీసుకుంటే మంచిదని జాతీయ భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఇరాక్, అఫ్గానిస్థాన్, సిరియాలో విజయవంతమైన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లపై భారత్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. క్షిపణులతో పాటు 500 పౌండ్ల బరువుండే రెండు లేజర్ గైడెడ్ బాంబులను ఇవి మోసుకెళ్లగలవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్