మిజోరంలో భూకంపం.. ప్రధాని ఆరా

మిజోరంలోసోమ‌వారం తెల్లవారుజామున 4:10 గంటలకు భూకంపం సంభవించింది.కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్‌సిఎస్) పేర్కొంది.......

Updated : 22 Jun 2020 14:13 IST

ఐజ్వల్: మిజోరంలో సోమ‌వారం తెల్లవారుజామున 4:10 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(ఎన్‌సిఎస్) తెలిపింది. దీని ప్రభావం ఎక్కువ‌గా ఛంపాయ్ జిల్లాలో న‌మోదైంద‌ని దాదాపు 27 కిలోమీట‌ర్ల లోతు వ‌ర‌కు భూమి కంపించిన‌ట్లు వెల్లడించింది. అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదని అధికారులు వెల్లడించారు. కానీ, కొన్ని ఇళ్లు, భవనాలు నేలకూలినట్లు తెలిపారు. అలాగే రోడ్లపై భారీ పగుళ్లు ఏర్పడడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు.

ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. మిజోరం ముఖ్యమంత్రి జోరంథాంగాతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర తరఫున కావాల్సిన అన్ని రకాల సహాయ, సహకారాల్ని అందిస్తామని భరోసా ఇచ్చారు.   

ఈశాన్య భారతంలో వరుసగా ఇది రెండో భూకంపం. ఆదివారం ఉదయం 4:16 గంటలకు మ‌ణిపూర్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా న‌మోదైంది. అలాగే, జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభ‌వించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని