వీరులారా.. దేశం మీకు సెల్యూట్‌ చేస్తోంది

తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద భారత్‌ - చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20మంది .......

Updated : 17 Jun 2020 17:29 IST

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద భారత్‌ - చైనా బలగాల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలో 20మంది జవాన్లు వీరమరణం పొందడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశ భూభాగాన్ని రక్షించే క్రమంలో వారు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని.. ఈ విషాదాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. ఈ వీర జవాన్ల త్యాగాలకు దేశం సెల్యూట్‌ చేస్తోందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆ సైనికుల ధైర్యం భరతమాతను కాపాడుకోవడం పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంచేస్తోందన్నారు. 

ఇంతటి గొప్ప ధీరత్వం కలిగిన హీరోలను భారత సైన్యానికి అందించిన ఆ కుటుంబాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. సైనికుల అత్యున్నత త్యాగాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అమిత్‌ షా చెప్పారు. జవాన్లను కోల్పోయిన ఈ దుఃఖ సమయంలో ఆయా కుటుంబాలకు ప్రధాని మోదీతో పాటు యావత్‌ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చైనా సైనికుల దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని