మిడతలపై ముప్పేట దాడికి..
గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతల దండు పశ్చిమ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు, మరోవైపు
యూకే నుంచి 60 ప్రత్యేక స్ర్పేయర్లు
87 అగ్నిమాపక శకటాలు, 810 ట్రాక్టర్లు
న్యూదిల్లీ: గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్ ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతల దండు పశ్చిమ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఈ మిడతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వేల ఎకరాల్లో పంట నాశనం కాకుండా, మిడతలను మట్టుపెట్టడానికి అత్యాధునిక స్ర్పేయర్లు, డ్రోన్లను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. మిడతల బెడద ఎక్కువగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివే!
* పంటలను నాశనం చేస్తున్న మిడతలను అంతం చేయడానికి యునైటెడ్ కింగ్డమ్ నుంచి అదనంగా 60 ప్రత్యేక స్ప్రేయర్లను కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.
* ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ పైలెటెడ్ ఎయిర్క్రాఫ్ట్లను వినియోగించేందుకు కేంద్ర పౌర విమానయానశాఖ నిబంధనలను సడలించింది. మిడతలపై రసాయనాలను పిచికారీ చేసే బాధ్యతను రెండు కంపెనీలకు అప్పగించనుంది. ఇప్పటికే ఆ కంపెనీలను ఖరారు చేశారు.
* మిడతల ప్రభావం అధికంగా ఉన్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
* ఉత్తర్ప్రదేశ్లోని 17 జిల్లాలోని రైతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఝాన్సీ, మహోబ, హమీపూర్, ఆగ్రా, అలీఘర్, మథుర, బులంద్షెహర్, హత్రాస్, ఎతాహ్, ఫిరోజాబాద్, మెయిన్పురి, ఎతవాహ్, ఫరూకాబాద్, ఔరియా, జలన్, కన్పూర్, లతిపూర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఝాన్సీలోని చాలా పంట పొలాలు మిడతలకు ఆహారం అయ్యాయి.
* రాజస్థాన్లోని బర్మార్, జోథ్పూర్, నాగౌర్, బికనేర్, గాంగార్, హనుమఘర్, సిర్కార్, జైపూర్, మధ్యప్రదేశ్లోని సత్నా, గ్వాలియర్, సీథి, రాజ్ఘర్, బైతులా, దేవాస్, ఆగ్రా మాల్వాల జిల్లాల్లో ఉన్న మిడతల దండులు చిన్నవని, అవి గుడ్లు పెట్టే దశకు రాలేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. వాటిని అంతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపింది.
* మిడతల నియంత్రణకు 200 లోకస్ట్ సర్కిల్ ఆఫీస్లు సర్వే చేపడుతున్నాయని ప్రభుత్వం తెలిపింది.
* రాజస్థాన్ 21 జిల్లాలు, మధ్యప్రదేశ్లోని 18, గుజరాత్ 2, పంజాబ్లోని ఒక జిల్లాలో మిడతల నియంత్రణ ఆపరేషన్లు మొదలు పెట్టారు.
* 89 ఫైర్ బ్రిగేడ్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. 120 సర్వే వాహనాలు, 47 ప్రత్యేక పిచికారీ వాహనాలు, 810 ట్రాక్టర్లను మిడతల నియంత్రణకు వాడుతున్నారు.
* గతేడాది తూర్పు ఆఫ్రికాలో భారీగా పుట్టుకొచ్చిన మిడతల అక్కడి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్, పాకిస్థాన్లకు చేరాయి. ఇప్పుడు భారతదేశంలో పంటలపై దాడికి తెగబడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.