కరోనాపై పోరులో బ్రెజిల్కు మరో ఎదురుదెబ్బ..
కరోనా వైరస్తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రెజిల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో నిర్ణయాలను వ్యతిరేకించి...
బ్రసీలియా: కరోనా వైరస్తో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న బ్రెజిల్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో నిర్ణయాలను వ్యతిరేకించి గతనెల 16న ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన నెల్సన్ టీచ్ కూడా శుక్రవారం రాజీనామా చేయడం గమనార్హం. ఇలా ఒకే నెలలో ఇద్దరు ఆరోగ్య మంత్రులు రాజీనామా చేయడం బ్రెజిల్లో నెలకొన్న తీవ్ర పరిస్థితులకు అద్దంపడుతోంది. కరోనాపై పోరులో అధ్యక్షుడి విధానాలే ఈ రాజీనామాలకు కారణాలని నిపుణులు భావిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు పలు ఆంక్షలను సడలించారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లు, పలు దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చారు. వైరస్ పెరుగుతున్న వేళ బోల్సోనారో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో టీచ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా, ఆయన నిర్ణయాలను సమర్థించలేక టీచ్ రాజీనామా చేసినట్లు సమాచారం. ఏదేమైనా ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వారంలో అక్కడ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వగా, శుక్రవారం నాటికి 2 లక్షలు దాటాయి. దీంతో అత్యధిక కేసుల జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్ దేశాలను బ్రెజిల్ దాటేసింది. అమెరికా తర్వాత ఒక్కరోజులో అధిక మొత్తంలో కేసులు నమోదవుతున్న దేశంగా అది నిలిచింది. మరోవైపు టీచ్ రాజీనామాకు సంబంధించి మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, అధ్యక్షుడు బోల్సోనారోకు సంబంధించిన ఓ ముఖ్య అధికారి ఈ విషయంపై స్పందించారు. టీచ్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని, ఆ విషయాన్ని అధ్యక్షుడితోనూ చర్చించారని చెప్పారు. ఇప్పుడున్న తాత్కాలిక ఆరోగ్య మంత్రి ఎడ్వర్డో పజెల్లో పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాలని కేబినెట్లోని సభ్యులు కోరారు.
ఆందోళన కలిగిస్తున్న కేసులు..
మరోవైపు దేశంలో కరోనా కేసులు అధికమవుతున్నాయి. గత మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. నిన్న ఒక్కరోజే 14 వేల కేసులు పెరగ్గా తాజాగా మరో 15 వేల కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇటలీ(2,24,000)ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బ్రెజిల్లో 2,18,000 కేసులు నమోదయ్యాయి. ఒక్కసారిగా వేల కేసులు పెరగడంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. రోజుకు సుమారు 800 మంది మరణిస్తున్నారు. దీంతో శ్మశానాల్లో సామూహిక ఖననాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు