250కి.మీ. ప్రయాణానికి ₹10 వేలు ఛార్జీ 

వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి చేరుకున్న వారికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దిల్లీలో క్వారంటైన్ ముగించుకున్న వారు సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ....

Published : 14 May 2020 19:51 IST

నోయిడా: వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి చేరుకున్న వారికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దిల్లీలో క్వారంటైన్ ముగించుకున్న వారు సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్‌ఆర్టీసీ) క్యాబ్, బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సేవలకుగాను వసూలు చేస్తున్న ఛార్జీలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. 250 కి.మీ ప్రయాణానికి రూ.10,000 అద్దె వసూలుచేయనున్నట్లు వెల్లడించింది. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) నుంచి నోయిడా, ఘజియాబాద్‌తో పాటు 250 కి.మీ పరిధిలో ఎక్కడికి ప్రయాణించాలన్న సెడాన్‌ మోడల్ కారుకు రూ.10,000, ఎస్‌యూవీ మోడల్ కారుకు రూ.12,000 అద్దె చెల్లించాలని తెలిపింది. అలానే 26 సీట్లు ఉన్న బస్సులో 100 కి.మీ దూరానికి ఒక్కో ప్రయాణికుడి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే క్వారంటైన్‌ ముగిసిన వలస కార్మికులకు మాత్రం ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు యూపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. గతంలో ఐజీఐఏ నుంచి నోయిడాకు క్యాబ్ సర్వీసులు కేవలం రూ. 800కు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత లాక్‌డౌన్‌తో క్యాబ్ సేవలు రద్దవ్వడంతో, ప్రభుత్వమే కొన్ని క్యాబ్‌లను అందుబాటులో ఉంచింది. అయితే వాటికి యూపీ ప్రభుత్వం అధిక మొత్తంలో అద్దెలు నిర్ణయించడంపట్ల పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి...

ఆ టికెట్లన్నీ రద్దు: రైల్వేశాఖ

ఆయుర్వేదం.. వారంలో క్లినికల్‌ ట్రయల్స్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని