ఆ టికెట్లన్నీ రద్దు: రైల్వేశాఖ
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రకటించిన లాక్డౌన్ మే 17వ తేదీ
న్యూదిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి ప్రకటించిన లాక్డౌన్ మే 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకూ బుక్ చేసుకున్న అన్ని రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జూన్ 30వ తేదీలోగా ప్రయాణించడానికి వీలుగా మార్చి 25వ తేదీ కన్నా ముందు బుక్ చేసుకున్న టికెట్లన్నీ రద్దు అవుతాయని తెలిపింది. టికెట్ల సొమ్ము తిరిగి ప్రయాణికుల ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించింది.
అయితే, వలస కూలీలను సొంతు ఊళ్లకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో బుక్ చేసుకున్న టికెట్లు రద్దు కావు. అదే విధంగా ఇటీవల ప్రారంభించిన 15 ప్రత్యేక రైళ్లకు సంబంధించిన టికెట్లకు ఇది వర్తించదు. ప్రస్తుతం ఐఆర్సీటీసీలో టికెట్లు బుక్ చేసుకునే ప్రతి ప్రయాణికుడి గమ్య స్థానాల చిరునామాను కూడా సేకరిస్తున్నారు. దీని వల్ల ప్రయాణికులు ఎక్కడ ఉంటారో సులభంగా గుర్తించవచ్చు. ఈ మేరకు ఆన్లైన్ రిజర్వేషన్లో మార్పులు చేశారు.
లాక్డౌన్ 4.0 మరిన్ని సడలింపులు ఉంటాయా?
ప్రస్తుతం విధించిన మూడో లాకౌడౌన్ మే 17వ తేదీతో ముగుస్తుంది. ఇప్పటికే లాక్డౌన్ 4.0 గురించి ప్రధాని నరేంద్రమోదీ సూచన ప్రాయంగా చెప్పారు. కొన్ని నిబంధనలతో దీన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన విధి విధానాలను మే 18వ తేదీ కన్నా ముందే వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే 15 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. బస్సులు నడిపే విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మేరకు బస్సు సీటింగ్లో మార్పులు చేస్తున్నారు. 14రోజులు క్వారంటైన్లో ఉండేందుకు ఇష్టపడేవారు హైదరాబాద్ నుంచి ఏపీకి రావొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రయాణికులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరి ప్రజా రవాణాకు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
రైలు టికెట్ల రద్దు.. ఇవి మీకు తెలుసా?
* రైల్వే టికెట్ల రద్దు నిర్ణయం శ్రామిక్ స్పెషల్ రైళ్లు, 15 ప్రత్యేక రైళ్లకు వర్తించదు.
* ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రత్యేక రైళ్లకు ఇది వర్తించకుండా మార్పులు చేశారు.
* మే 13వ తేదీ నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ గమ్య స్థానాలకు సంబంధించిన చిరునామా తప్పకుండా ఇవ్వాలి. దీని వల్ల ఆ ప్రయాణికులను గుర్తించడం సులభం అవుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ఇది ఉపయోగపడుతుంది.
* మే 13వ తేదీ నుంచి ఐఆర్సీటీసీలో ఈ మేరకు మార్పులు చేశారు.
* కరోనా లక్షణాలతో బాధపడేవారిని ప్రయాణానికి అనుమతించరు. అలాంటి ప్రయాణికులకు టికెట్ డబ్బులు మొత్తం చెల్లిస్తారు.
* ఒక పీఎన్ఆర్ మీద బృందంగా ప్రయాణించే వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ మొత్తం బృందం టికెట్లు రద్దవుతాయి. ఆ టికెట్ల మొత్తాన్ని రీఫండ్ చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం