కరోనా కట్టడిలో ఆ దేశాల విజయ రహస్యం!
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే 43లక్షలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా దాదాపు 3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలను భయోత్పాతం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటికే 43లక్షలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి బారినపడగా దాదాపు 3లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ధనిక, పేద దేశాలనే తేడా లేకుండా అన్ని దేశాలను భయోత్పాతం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దశలో కొన్ని దేశాలు దీన్ని నియంత్రించలేమని చేతులెత్తేయగా మరికొన్ని మాత్రం పోరాడుతూనే ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని దేశాలు మాత్రం ఈ మహమ్మారిని నియంత్రించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిలో స్లోవేనియా, జోర్డాన్, ఐస్లాండ్, గ్రీస్, వియత్నాం ముందస్తు చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుచేశాయి. భౌతిక దూరంపై అవగాహన కలిగించడంతోపాటు వేల సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కరోనా వైరస్ కట్టడిలో విజయం సాధిస్తున్నాయి.
స్లోవేనియా
కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఇటలీపక్కనే స్లోవేనియా ఉన్నప్పటికీ కరోనా వైరస్పై ముందుగానే మేల్కొంది. అక్కడి ప్రధాన మంత్రి రాజీనామా చేయడంతో మార్చి 13నే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే కరోనా విస్తృతి గమనించిన ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ను అమలులోకి తెచ్చిన ప్రభుత్వం కారణం లేకుండా ఎవ్వరినీ బయటకు అనుమతించలేదు. ఆ సమయంలో అనుమానం కలిగిన ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక రక్షణ పరికరాలను అందరికీ అందుబాటులో ఉంచింది. కరోనా కట్టిడిలో స్లోవేనియా విజయం సాధించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అక్కడి ప్రజల స్పందన, ఆ దేశ మెరుగైన ఆరోగ్య వ్యవస్థలతో పాటు అక్కడి నిబద్ధత గల వైద్య సిబ్బంది ఎంతో దోహదం చేశాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అమలుచేస్తూ, నిబంధనలను కచ్చితంగా పాటించారు. అత్యవసర వస్తువుల ఉత్పత్తి మినహా అన్ని రకాల ఉత్పత్తులను ఆసివేసింది. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయనప్పటికీ విదేశీయుల రాకను నియంత్రించారు. 14రోజుల క్వారంటైన్ అమలుపరచడంతోపాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంతోపాటు ప్రజలనుంచి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని సేకరించారు. ప్రపంచంలో ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు ఏ దేశంలోనూ చూడలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.
పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్లోవేనియాలో మార్చి 4న తొలి పాజిటివ్ కేసు నిర్ధారణ అయ్యింది. అనంతరం రెండు వారాల్లోనే దేశంలోని పాఠశాలలు, వాణిజ్య కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ నిలిపివేశారు. దేశవ్యాప్తంగా షట్డౌన్ విధించి.. ఉద్దీపన కింద దాదాపు 3బిలియన్ల యూరోలను తమ పౌరులకు అందించింది. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సరైన సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరోనా నియంత్రణకు ఎంతగానో దోహదం చేశాయి. ప్రస్తుతం అక్కడ 1460 పాజిటివ్ కేసులు నమోదుకాగా 102మరణాలు సంభవించాయి.
జోర్డాన్
అరబ్ దేశాల్లో ఒకటైన జోర్డాన్లో కరోనా వైరస్ను అనతికాలంలోనే కట్టడిచేసింది. మార్చి 2న తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. అప్పటికి ఐదు వారాల ముందే ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఒకవేళ కరోనా కేసులు నమోదైతే రోగులకు ఏయే ఆసుపత్రిలో చికిత్ప చేయాలి?, ఆసమయంలో వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగులకు ఎలా చికిత్స చేయాలనే విషయాలపై అవగాహన కల్పించింది. అంతేకాకుండా రాజు ఆదేశాల మేరకు లాక్డౌన్, కర్ఫ్యూను కచ్చితంగా అమలుచేసేందుకు మిలటరీకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలతో వైరస్ను కట్టడి చేయడంతో దేశంలో పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యను తగ్గించుకోగలిగింది. ఇప్పటివరకు దేశంలో 560 పాజిటివ్ కేసులు, 9మరణాల సంభవించాయి.
ఐస్లాండ్
తక్కువ జనాభా కలిగిన ఐస్లాండ్లో 1800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా స్వల్ప లక్షణాలు కలిగిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేషన్ ఉంచే ప్రక్రియ ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. ఇలా చేయడం ద్వారా వైరస్ను ఇతరులకు సోకడాన్ని నివారించగలిగింది. దీంతో మరణాల సంఖ్యనూ నియంత్రించగలిగింది. ఇప్పటివరకు ఐస్లాండ్లో వైరస్ సోకినవారిలో 10మంది మరణించారు.
గ్రీస్
ఇక అత్యధిక వృద్ధ జనాభా కలిగిన గ్రీస్ కరోనా కట్టడిలో అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతేకాకుండా పర్యాటకంపైనే ఎక్కువ ఆధారపడే గ్రీస్ సరైన సమయంలో లాక్డౌన్ అమలుపరిచింది. మెరుగైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న గ్రీస్లో భౌతికదూరంపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈస్టర్ సమయంలోకూడా ప్రజలు పెద్దఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా పర్యాటకులు తమ దేశంలోని రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీంతో దేశంలో 2700పాజిటివ్ కేసులు, 150 మరణాల వద్దే నియంత్రించగలిగింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో వేసవిలో తమ దేశానికి పర్యాటకులు రావొచ్చని ఆహ్వానం పలకడం గమనార్హం.
వియత్నాం
ఇక కరోనా మహమ్మారి పుట్టిన చైనాకు సరిహద్దు కలిగిన వియత్నాం కొవిడ్-19ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఇప్పటివరకు ఇక్కడ కేవలం 288పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయంటే ఈ వైరస్ను ఎంతలా కట్టడి చేసిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో ఒక్కరుకూడా మరణించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల కన్నా ముందే వియత్నాం కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు నమోదవుతున్నా కొద్దీ వారి కాంటాక్ట్లను ట్రేస్ చేసి వారిని క్వారంటైన్లో పెట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టగలిగింది. చైనాలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న సమయంలోనే వియత్నాం ముందస్తు చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇలా ఆదిలోనే మేల్కోన్న ఈ దేశ ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
Sunetra Pawar: బారామతి స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25 వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో క్లీన్ చిట్ లభించింది. -
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
Viral video: ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్