తొందరపడితే కరోనా మింగేస్తుంది.. జాగ్రత్త!
కరోనా వైరస్ విసిరిన పంజాకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. పేద, ధనిక దేశాలనే తేడాలేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలయ్యాయి. ప్రపంచ సూపర్ పవర్ దేశాలుగా పేరెన్నిక.......
కరోనాపై సూపర్ పవర్ దేశాల్ని హెచ్చరిస్తున్న నిపుణులు
పాక్షిక సడలింపులతో పలుచోట్ల పెరుగుతున్న కేసులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ విసిరిన పంజాకు ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. పేద, ధనిక దేశాలనే తేడాలేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలయ్యాయి. ప్రపంచ సూపర్ పవర్ దేశాలుగా పేరెన్నిక గన్న దేశాల్నీ ఈ మహమ్మారి మరింతగా కుదిపేస్తోంది. తీవ్ర సంక్షోభంలోకి జారిన తమ ఆర్థిక వ్యవస్థలు త్వరగా కోలుకొనేందుకు సడలింపులు ఇవ్వాలని సూపర్ పవర్ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయా దేశాధినేతలకు ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. సరైన మార్గదర్శకాలను అనుసరిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ విశ్వ మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి రాకుండా హడావుడిగా ఆర్థిక వ్యవస్థలను తెరవడం వల్ల మరింత నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.
హడావుడితో తీరని నష్టమే..
కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎంతో క్లిష్టంగా ఉన్నాయని అమెరికాకు చెందిన అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఒకవేళ అమెరికాలోని నగరాల్లో ఆర్థిక వ్యవస్థను హడావుడిగా తెరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటికే 80వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ సరైన మార్గదర్శకాలను అనుసరించకుండా ఆర్థిక వ్యవస్థలను తెరిస్తే.. ఈ వైరస్ మరింతగా విజృంభించి చేటు తెస్తుందని ఫౌచీ ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రముఖులకు కరోనా.. మరోవైపు లాక్డౌన్ సడలింపులు
రష్యాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్తో పాటు పలువురు మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే, పెస్కోవ్ ఆస్పత్రి పాలైన మరుసటి రోజే (సోమవారం) దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నట్టు పుతిన్ ప్రకటించడం గమనార్హం. అలాగే, గత నెలలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరి కోలుకోవడం ఈ వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో నొక్కి చెబుతోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4.2మిలియన్ల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 2.87 లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో అయితే 2.32లక్షల కేసులు నమోదు కాగా.. 2100 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాంటాక్ట్ ట్రేసింగ్లో ఆ దేశాలు భేష్!
జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు కాంటాక్ట్ ట్రేసింగ్లో బాగా చేశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఎమర్జెన్సీస్ చీఫ్ డాక్టర్ మైఖేల్ రియాన్ తెలిపారు. కరోనా బాధితులను గుర్తించి వైరస్ వ్యాప్తిని కట్టడి చేశాయని ప్రశంసించారు. అందుకే అక్కడ కరోనా నియంత్రణలో ఉందన్నారు. కానీ ఇతర దేశాలు మాత్రం కరోనా రోగులను కలిసిన ప్రైమరీ కాంటాక్టులను గుర్తించడం, వారిని ట్రేస్ చేసి క్వారంటైన్కు తరలించడంలో అంత సమర్థంగా వ్యవహరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘మాంసం ప్యాకింగ్’ పరిశ్రమలో కరోనా విజృంభణ
మరోవైపు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు స్టే ఎట్ హోం నిబంధనల్ని నీరుగారుస్తూ తమ కార్యకలాపాలను ముందుకు కొనసాగించడం ప్రారంభించాయనీ.. దీంతో ఆఫీసులకు వెళ్లిన వేలాది మంది ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారని అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణలో వెల్లడైంది. అలాగే, మాంసం ప్యాకింగ్, పౌల్ట్రీ ప్రాసిసింగ్ ప్లాంట్ల వద్ద ఈ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్, ఆస్టిన్లలో నిర్మాణరంగ కార్మికుల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని 15 కౌంటీలలో ఏప్రిల్ 28 నుంచి మే 5 మధ్య పెద్ద మొత్తంలో నమోదైన కేసుల్లో మాంసం ప్యాకింగ్, పౌల్ట్రీ ప్రాసిసింగ్ ప్లాంట్లు/ కారాగారాల్లోనే అధికంగా ఉన్నట్టు గణాకాంల్లో వెల్లడించింది.
24గంటల్లో 200మంది నర్సులకు..
అమెరికాలో వైద్య సిబ్బందిని కరోనా వెంటాడుతోంది. కరోనా రోగులకు అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాలిఫోర్నియాలో ఒక్క రోజులోనే 200 మంది నర్సులకు కరోనా సోకినట్టు నర్సింగ్ అసోసియేషన్ డైరెక్టర్ గెరార్డ్ బోర్డాన్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 28వేల మంది నర్సులు కరోనా బారిన పడగా.. వారిలో 230మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. అమెరికాలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు నిబంధనల్ని సడలిస్తే పొంచి ఉన్న ముప్పును సూచిస్తున్నాయని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటలీలో సడలింపుల తర్వాత పెరుగుతున్న కేసులు!
ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. కొన్నాళ్ల పాటు అక్కడ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ నిబంధనల్ని కాస్త సడలించాక అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నట్టు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి నిన్నటి వరకు లాంబార్డీ ప్రాంతంలోనే 1033 కొత్త కేసులు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇటలీలో ఇప్పటివరకు 2.21లక్షలకు పైగా కేసులు నమోదు కాగా మరణాలు 30,911కి చేరాయి. ఇక్కడ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
24గంటల్లో అక్కడ 172 మరణాలు నమోదు కావడం గమనార్హం. ఇటలీలోని మొత్తం కరోనా మరణాల్లో దాదాపు సగం మృతులు లాంబార్డీలోనే కావడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. మే4న అక్కడ లాక్డౌన్ పరిమితుల్ని పాక్షికంగా ఎత్తివేసిన ఈ కేసులు పెరుగుతుండటంపై మే 4న లాక్డౌన్ పరిమితుల్ని పాక్షికంగా ఎత్తివేసిన తర్వాత ఈ వైరస్ వ్యాప్తి రేటు ఎలా ఉంది? రోజూ ఎన్నికేసులు నమోదవుతున్నాయి? అనే అంశంపై అక్కడి వైద్య అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!