వారిని బస్సులు, రైళ్లలోనే పంపించండి..

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

Updated : 11 May 2020 11:22 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

* వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులను రోడ్డు, రైలు పట్టాల ద్వారా నడవనీయకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి.

* వీరందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు, శ్రామిక్‌ రైళ్ల ద్వారానే పంపించే ఏర్పాట్లు చేయాలి.

*రైళ్లలో ప్రయాణించే వరకూ కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు కొనసాగించడంతోపాటు నీరు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలి.

* ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు కూలీలకు అవకాశం కల్పించాలి.

మెడికల్, పారిశుధ్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రైవేటు క్లినిక్ లు తెరిచే విషయాలపై అజయ్ భల్లా రాష్ట్రాలకు మరో లేఖ రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని