కరోనా ఎఫెక్ట్: బ్రెజిల్లో చేతులెత్తేసిన ఆస్పత్రులు
లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ కొత్త కేసులను చేర్చుకోలేమని దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులు చేతులేత్తేశాయి...
అక్కడి పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న వైనం
రియోడి జనీరో: లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ కొత్త కేసులను చేర్చుకోలేమని దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దీంతో శవాగారాలు, శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని ఆస్పత్రులు కరోనా పేషంట్లతో నిండిపోయాయి. దీంతో కొత్తవారిని చేర్చుకోలేమని అక్కడి వైద్య సిబ్బంది తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్లో అధికారికంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ నమోదైన అధికారిక కేసుల సంఖ్య 52,995 కాగా, మృతుల సంఖ్య 3600.
తేలిగ్గా తీసుకుంటున్న అధ్యక్షుడు..
మరోవైపు దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్నా ఆ దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తేలిగ్గా తీసుకోవడం ఆందోళనకరంగా మారింది. ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి సామాజిక దూరం పాటించాల్సిన అవసరం లేదని, బ్రెజిలియన్లలో అధిక ప్రమాదం ఉన్న వారిని మాత్రమే ఐసోలేట్ చేయాలని ఆయన సూచించారు. దీంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక అమెజాన్ రాష్ట్రంలోని మానాస్ నగరంలో.. ఒక శ్మశానవాటికలో పెద్దఎత్తున గోతులు తవ్వి సామూహిక ఖననాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని చెప్పారు. రోజూ వంద మృతదేహాలను ఖననం చేస్తున్నట్లు తెలిపారు. మానాస్లో శవాలను తరలించే ఓ డ్రైవర్ మాట్లాడుతూ.. ఇటీవల తాను నిర్విరామంగా 36 గంటలు పనిచేశానని చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తన యజమాని ఇంకో డ్రైవర్ను నియమించుకోవాల్సి వచ్చిందని వివరించారు.
బాధితుల సంఖ్య ఎక్కువే అంటున్న నిపుణులు..
గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3700 కొత్త కేసులు నమోదుకాగా, 400 మంది మరణించారని అధికారులు స్పష్టంచేశారు. శుక్రవారం కూడా ఆ సంఖ్యలు మరింత పెరిగాయని తెలుస్తోంది. బ్రెజిల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించడంతో అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న మరణాలన్నీ గడిచిన రెండు వారాల కేసులని సావో పాలో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం నమోదైన కేసుల కంటే ఇంకా ఎక్కువే ఉంటాయని ఆ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. కాగా, బ్రెజిల్లో రోజుకు 6700 పరీక్షలు జరిపే సామర్థ్యముందని ఈ నెల ఆరంభంలో అక్కడి వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ పరిస్థితి చేయిదాటిపోతే రోజుకు 40 వేల పరీక్షలు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. మరోవైపు తమ ల్యాబ్ల్లో నిరంతరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, అయినా వైరస్ను ఎదుర్కోవాలంటే ఇంకా పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కెనీ కొలార్స్ అనే ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్టు పేర్కొన్నారు.
ఇదీ అక్కడి పరిస్థితి..
రియో నగరానికి చెందిన ఎడినిర్ బెస్సా అనే 65 ఏళ్ల మహిళకు ఏప్రిల్ 20న వైద్య సదుపాయం అవసరమైంది. రెండు ఆస్పత్రులు ఆమెను చేర్చుకోడానికి నిరాకరించాయి. తర్వాత 40 మైళ్ల దూరంలో ఉన్న మరో ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతిచెందడంతో మృతదేహాన్ని మళ్లీ రోనాల్డో గొజొలా అనే మరో ఆస్పత్రికి పంపారు. అక్కడ తన తల్లి మృతదేహాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె కుమారుడు రొడ్రిగా బెస్సా వాపోయారు. ‘ఆస్పత్రి బేస్మెంట్లో అనేక మంది మృతదేహాలు చూశా. అందులో కరోనా అనుమానితులవి కూడా ఉన్నాయి. నా తల్లి మృతదేహాన్నీ కరోనా అనుమానిత మృతిగానే ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి’ అని రోడ్రిగ అక్కడి పరిస్థితిని వివరించారు. ఈ అనుమానిత కేసులన్నీ అధికారిక లెక్కల్లో కలపకపోవడం గమనార్హం. తన తల్లి మృతదేహాన్ని బుధవారం ఖననం చేశామని, అంత్యక్రియలకు చాలా తక్కువ సంఖ్యలో బంధుమిత్రులు హాజరయ్యారని రోడ్రిగ చెప్పారు. ప్రజలంతా ఈ వైరస్తో అప్రమత్తంగా ఉండాలని, అది ప్రాణాంతమైందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిలో ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో గతవారం తన కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించారు. కరోనా నివారణకు ప్రజలను అప్రమత్తం చేసినందుకు తొలగించడం గమనార్హం.
ఇవీ చదవండి:
ట్రంప్ నోటికి తాళం?
నాలుగో వంతు మరణాలు అమెరికాలోనే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!