అంత్యక్రియలకు 50వేలకు పైగా హాజరు
దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఓ మతపెద్ద అంత్యక్రియలకు 50వేలకు పైగా ప్రజలు హాజరవ్వడంతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. ఊహించని రీతిలో ప్రజలు రావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బంగ్లాదేశ్లో 2,144 మందికి కొవిడ్-19 సోకగా 84 మంది మృతిచెందారు....
ఊహించని పరిస్థితితో బంగ్లాదేశ్ ఉలిక్కిపాటు
ఢాకా: దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ ఓ మతపెద్ద అంత్యక్రియలకు 50వేలకు పైగా ప్రజలు హాజరవ్వడంతో బంగ్లాదేశ్ ఉలిక్కిపడింది. ఊహించని రీతిలో ప్రజలు రావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బంగ్లాదేశ్లో 2,144 మందికి కొవిడ్-19 సోకగా 84 మంది మృతిచెందారు.
బంగ్లాదేశ్ ఖలీఫత్ మజ్లిస్ నయీబ్ ఈ ఆమిరైన మౌలానా జుబెయిర్ అహ్మద్ అన్సారీ (55) శుక్రవారం సరైల్ ఉపజిలాలోని బెర్తెలా గ్రామంలో మరణించారు. స్థానిక మదర్సాలో శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అనుమతి లేనప్పటికీ ఢాకా సహా వేర్వేరు ప్రాంతాల నుంచి అనూహ్యంగా వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. ‘ప్రభుత్వం నిర్దేశించిన సోషల్ డిస్టెన్సింగ్ను పట్టించుకోకుండా శనివారం ఉదయం దాదాపు 50వేల మంది హాజరయ్యారు’ అని ఆ వార్తా సంస్థ పేర్కొంది.
దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే వేలాది మంది అంత్యక్రియలకు హాజరవ్వడంతో అధికారులు, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం గుమిగూడటాన్ని నిషేధించనప్పుడు ఈ అంత్యక్రియలు జరిగాయి’ అని ఆ జిల్లా కరోనా వైరస్ నియంత్రణ కమిటీ సభ్యుడు అల్ మమున్ సర్కార్ అన్నారు. ‘ ప్రజలు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటప్పుడు వేలాది మంది హాజరవ్వడం నా ఊహాకు అందడం లేదు’ అని జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ ఇక్రమ్ ఉల్లా పేర్కొన్నారు. ఇంతమంది వస్తారని తాము ఊహించలేదని, ప్రజలు గుమిగూడకుండా తామేం చేయలేకపోయాని స్థానిక పోలీసులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!