వెనకడుగు వేసే సమయం కాదు:డబ్ల్యూహెచ్ఓ
కరోనా (కొవిడ్-19) మహమ్మారి ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సమర్థ చర్యల్ని చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పిలుపునిచ్చింది...........
ఇంటర్నెట్ డెస్క్: కరోనా (కొవిడ్-19) మహమ్మారి ప్రపంచ దేశాల్ని కలవరపెడుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సమర్థ చర్యల్ని చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పిలుపునిచ్చింది. కొన్ని దేశాలు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్తో పోరాడే క్రమంలో ఏ ఒక్క దేశం వెనకడుగు వేయొద్దని సూచించారు. ఉన్న అన్ని మార్గాల్ని వినియోగించుకోవాలని నొక్కి చెప్పారు. మరోవైపు బ్రిటన్లో తొలి కరోనా మరణం సంభవించింది. ఇదే దేశానికి చెందిన మరో వ్యక్తి గతంలో టోక్యోలో మరణించాడు. అతనికి డైమండ్ ప్రిన్సెస్ నౌకలో వైరస్ సంక్రమించింది. మరో 115 మందికి బ్రిటన్లో వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
> తొలుత వ్యాధి వెలుగులోకి వచ్చిన చైనాలో మరో 30 మంది వైరస్ వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు అక్కడ మరణించిన వారి సంఖ్య 3,042కు చేరింది. మరో 143 కొత్త కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 80,552కు చేరింది. వైరస్ను కట్టడి చేసేందుకు చైనా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. వైరస్కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు కృత్రిమ మేధను ఉపయోగిస్తోంది. దీంతో తీసుకుంటున్న చర్యలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేందుకు దోహదం అవుతోందని అధికారులు తెలిపారు.
> ఆసియాలో చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన ఇరాన్లో మృతుల సంఖ్య 107కు చేరింది. బాధితులు సంఖ్య 3,513ను తాకింది. గత 24 గంటల్లో 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఇళ్లలో ఉండేవారి కోసం వినోదభరితమైన కార్యక్రమాల్ని అందించాలని టీవీ ఛానళ్లకు అధ్యక్షుడు హసన్ రౌహానీ సూచించారు.
>అమెరికాలో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. వీరిలో 11 మంది వాషింగ్టన్కు చెందిన వారు కాగా, మరొకరు కాలిఫోర్నియా వాస్తవ్యులు. కొత్తగా మరో 53 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో బాధితుల సంఖ్య 145కు చేరింది.
> యూరప్లో వైరస్కు కేంద్రంగా ఉన్న ఇటలీలో మరో 41 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మరణాల సంఖ్య 148కి చేరింది. మరో 769 కొత్త కేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 3,858కి చేరింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. క్రీడాకార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. వైరస్ కట్టడికి అక్కడి ప్రభుత్వం 8.4 బిలియన్ డాలర్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
> అమెరికాలో కాలిఫోర్నియా తీరంలో ‘గ్రాండ్ ప్రిన్సెస్’ అనే భారీ నౌకను నిలిపి ఉంచారు. దీంట్లో 3,500 మంది ఉన్నారు. గతంలో ఈ నౌక నుంచి దిగిన ఓ వ్యక్తి వైరస్తో చనిపోయినట్లు గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం వారికోసం హెలికాప్టర్ ద్వారా ప్రత్యేకంగా పరీక్ష కిట్లను పంపారు. వారందరినీ పరీక్షించే వరకూ బయటకు తీసుకొచ్చేది లేదని కాలిఫోర్నియా ప్రభుత్వం తేల్చి చెప్పింది.
> దక్షిణాఫ్రికాలో గురువారం తొలి కరోనా కేసు నమోదైంది.
> వచ్చే వారం స్ట్రాస్బర్గ్లో జరగాల్సిన ఐరోపా సమాఖ్య పార్లమెంటు సమావేశ వేదికను వైరస్ ముప్పు నేపథ్యంలో బ్రస్సెల్స్కు మార్చారు.
దేశం | బాధితుల సంఖ్య | మరణాల సంఖ్య |
చైనా | 80,552 | 3,042 |
దక్షిణ కొరియా | 6,284 | 42 |
ఇరాన్ | 3,513 | 107 |
ఇటలీ | 3,858 | 148 |
అమెరికా | 145 | 12 |
జపాన్ | 330 | 6 |
ఫ్రాన్స్ | 423 | 07 |
హాంకాంగ్ | 104 | 02 |
భారత్ | 30 | 00 |
ప్రపంచవ్యాప్తంగా | 97,737 | 3,382 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ