ఉచిత ఫోన్లా? కరోనా వల్లే ఇవ్వలేకపోతున్నాం
పంజాబ్లోని యువతకు ఉచిత స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని కరోనా వల్లే అమలు చేయలేకపోతున్నామని సీఎం అమ్రీందర్ సింగ్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదంటూ విపక్షాలు తీవ్ర........
అసెంబ్లీలో పంజాబ్ సీఎం ప్రకటన
చండీగఢ్: పంజాబ్లోని యువతకు ఉచిత స్మార్ట్ఫోన్లు పంపిణీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని కరోనా వల్లే అమలు చేయలేకపోతున్నామని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం సీఎం అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రకటించారు. చైనా కరోనాతో విలవిలలాడుతోందని.. అందుకే అక్కడి నుంచి స్మార్ట్ ఫోన్లు రావడంలో జాప్యం నెలకొందన్నారు. ఫోన్లు రాగానే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఎన్నికల మేం ఇచ్చిన హామీల్లో ఉచిత స్మార్ట్ఫోన్ల పంపిణీ ఒకటి. అయితే, దానిలో కొంత జాప్యం జరిగింది. చైనాలో దాని ప్రభావం తగ్గగానే ఫోన్లు వస్తాయి. ఇందుకు నెలో, రెండు నెలలో, నాలుగు నెలలైనా పట్టవచ్చు’’ అని సభలో చెప్పారు.
గతేడాది సింగ్ జనవరి 26 కల్లా ఉచిత స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12 తరగతులు చదివే విద్యార్థినులకు ఈ ఫోన్లు అందిస్తామని చెప్పారు. అయితే, రిపబ్లిక్డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. మార్చి 31నాటికి ఇస్తామని చెప్పడం గమనార్హం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని శిరోమణి అకాళీదళ్, భాజపా, ఆప్ పార్టీలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
ఎన్నికలకు ముందు 2017లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. డిజిటల్ టెక్నాలజీ జీవనవిధానంలో భాగమైపోయిందనీ.. దీన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.