కొవిడ్-19 వైరస్ ఇంకా ఎంతమందికి..?
కొవిడ్-19గా నామకరణం చేసిన కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుతుంది? చైనాలో దీనివల్ల సంభవిస్తున్న మరణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ఇంకా ఎన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుంది....................
లండన్: కొవిడ్-19(కరోనా వైరస్గా) ఎప్పుడు తగ్గుతుంది? చైనాలో దీనివల్ల సంభవిస్తున్న మరణాలకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది? ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుంది?వీటన్నింటికీ ఇప్పటికైతే కచ్చితమైన సమాధానాలు లేవనే చెప్పాలి. కానీ, కొత్తగా సోకుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన కాస్త ఊరట కలిగిస్తున్నా.. పూర్తిగా ఎప్పుడు అదుపులోకి వస్తుందన్న అంశంపై మాత్రం స్పష్టత లేదు. అయితే ఈ పరిణామాలపై హాంకాంగ్కు చెందిన ప్రముఖ రోగవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ గాబ్రియెల్ లియాంగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈయన గతంలో సార్స్ని అరికట్టడంలో కీలకపాత్ర పోషించారు. హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ హెల్త్ మెడిసిన్ విభాగం ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
ఈ కొవిడ్-19 వైరస్ ఇంకా ఎంతదూరం ప్రయాణిస్తుందనే ప్రశ్న నిపుణుల్ని తొలచివేస్తోందని లియాంగ్ అభిప్రాయపడ్డారు. అయితే.. చాలా మంది విశ్లేషణల ప్రకారం ఒక్క వైరస్ బాధితుడి వల్ల సగటున 2.5 మందికి సంక్రమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ లెక్కన వైరస్ను అదుపు చేయలేకపోతే ప్రపంచవ్యాప్తంగా 60-80శాతం మంది దీని బారిన పడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ఒకశాతం మరణాల రేటు ఇలాగే కొనసాగినా.. ప్రాణనష్టం తీవ్ర స్థాయిలోనే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) జెనీవాలో తాజా వైరస్పై నిర్వహించబోయే సదస్సుకు వెళుతూ ఓ ప్రముఖ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా సహా పలు దేశాలు తీసుకుంటున్న చర్యలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు చైనా తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సత్ఫలితాలనిస్తున్నాయన్న దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలు, కార్యాలయాల మూసివేత, రవాణా నిషేధం వంటి చర్యలతో వైరస్ను ఎంతవరకు కట్టడి చేయగలమన్నది చాలా ముఖ్యమైన అంశమన్నారు. ఇలా ఎంతకాలం ఆంక్షలు విధించగలమన్న అంశంపై కూడా దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. ఒకవేళ ఈ చర్యలేవీ పనిచేయనట్లయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే వైరస్ను నిరోధించే చర్యలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైరస్ సోకి లక్షణాలు బయటిపడని వారిని గుర్తించడమే ఇప్పుడు పెద్ద సవాల్గా మారిందన్నారు. సమూహంలో ఏ ఒక్కరికి వైరస్ సోకినట్లు గుర్తించినా వారందరినీ 14 రోజుల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచాల్సిందేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు