థాయిలాండ్‌లో కాల్పులు: 17మంది మృతి

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లో ఓ సైనికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఖోరత్‌ ప్రాంతంలో సైనికుడు తుపాకీ చేత పట్టుకొని ద్విచక్రవాహనంపై తిరుగుతూ ...

Updated : 07 Dec 2022 21:55 IST

బ్యాంకాక్‌: థాయిలాండ్‌లో ఓ సైనికుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ఖోరత్‌ ప్రాంతంలో తుపాకీ చేత పట్టుకొని ద్విచక్రవాహనంపై తిరుగుతూ కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారందరిపై ఇష్టానుసారంగా కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ షాపింగ్‌ మాల్‌ ఎదుట తిరుగుతూ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం షాపింగ్‌మాల్‌లోకి చొరబడి అక్కడి ప్రజలను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని