కరోనాతో అమెరికా పౌరుడు మృతి
కరోనా వైరస్ బారిన మరణించిన వారి జాబితాలో విదేశీయులు కూడా చేరుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు చైనాలోని ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది.......
బీజింగ్: కరోనా వైరస్ బారినపడి మరణించిన వారి జాబితాలో విదేశీయులు కూడా చేరుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు చైనాలోని ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. కరోనా బారిన పడి మరణించిన తొలి విదేశీయుడు ఇతడే కావొచ్చని భావిస్తున్నారు. 60ఏళ్ల ఓ అమెరికా పౌరుడు వుహాన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6న మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేసిన రాయబార కార్యాయలం.. ఇతర వివరాలేవీ వెల్లడించలేమని తెలిపింది. తమ దేశంలో ఉన్న 19 మంది విదేశీయులకు వైరస్ సోకినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
జపాన్ పౌరుడు కూడా..!
జపాన్కు చెందిన ఓ వ్యక్తి కూడా కరోనా వైరస్ ధాటికి మృతిచెందినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ అనుమానిస్తోంది. వుహాన్లో ఉన్న ఓ 60 ఏళ్లు పైబడిన వ్యక్తి ఇటీవల తీవ్ర జ్వరం, న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరినట్లు చైనా అధికారులు జపాన్కు సమాచారం ఇచ్చారు. చికిత్స అందిస్తుండగానే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు తెలిపారు. కరోనా వైరస్ వల్లే చనిపోయి ఉంటారని భావిస్తున్నామని జపాన్ అధికారులకు సమాచారం చేరవేశారు. చైనాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 724 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. మరో 34 వేల మందికి పైగా వైరస్తో పోరాడుతున్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.