దిల్లీ ఎన్నికల్లో భాజపాకు అకాలీదళ్ మద్దతు
దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) తమకు మద్దతు తెలుపుతుందని భాజపా ప్రకటించింది. ఈ మేరకు బుధవారంనాడు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...
దిల్లీ: దేశ రాజధానిలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) తమకు మద్దతు ప్రకటించిందని భాజపా తెలిపింది. బుధవారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం ఇరు పార్టీల నేతలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయని, దిల్లీ ఎన్నికల్లో భాజపాకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు భేటీ అనంతరం సుఖ్బీర్ పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తమకు మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘శిరోమణి అకాలీదళ్ దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపాకు మద్దతు తెలపాలని తీసుకొన్న నిర్ణయానికి సుఖ్బీర్ సింగ్ బాదల్కు ధన్యవాదాలు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) భాగస్వామ్య పక్షాలలో ఎస్ఏడీ ముఖ్యమైనది. ప్రజలకు సేవచేయడంలో ఆ పార్టీ ఎప్పుడూ ముందుంటుది. మా రెండు పార్టీల మధ్య భాగస్వామ్యం ఎప్పటికీ బలంగానే ఉంటుంది’’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ సమావేశానికి ముందు సుఖ్బీర్ నివాసానికి చేరుకొన్న నడ్డాకు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ ‘‘జాతీయ ప్రయోజనాలతోపాటు, దేశ వ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రజల కోసం రెండు పార్టీలు కూటమిగా ఏర్పడినట్లు తెలిపారు. రాబోయే దిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలు భాజపాతో కలిసి పనిచేస్తారని వెల్లడించారు. భాజపాతో తమ పార్టీ ఎప్పడూ తెగతెంపులు చేసుకోలేదని, కేవలం ఎన్నికల్లో కలిసి పోటీచేయకూడదని మాత్రమే నిర్ణయించుకున్నామని’’ అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం, సీట్ల పంపకాల విషయంలో భాజపా, ఎస్ఏడీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఇటీవల ఎస్ఏడీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో కొంత ఆందోళనకు గురైన భాజపా.. దిల్లీలో కొన్ని స్థానాల్లో సిక్కు ఓటర్లు తమకు దూరమవుతారని భావించి ఎస్ఏడీతో చర్చలు జరిపి ఆ పార్టీ మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి