ఫ్రాన్స్: మూడో ధాటికి మూడోసారి లాక్డౌన్!
ఫ్రాన్స్ మరోసారి లాక్డౌన్కు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అక్కడ కరోనా మూడో దఫా విజృంభణతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పడంలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించారు.
ప్రకటించిన అధ్యక్షుడు మేక్రాన్
పారిస్: ఏడాది గడుస్తోన్నా.. కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఫ్రాన్స్ మరోసారి లాక్డౌన్కు సిద్ధమయ్యింది. ప్రస్తుతం అక్కడ కరోనా మూడో దఫా విజృంభణతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పడం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు.
కరోనా వైరస్ తీవ్రతకు ఫ్రాన్స్ మరోసారి వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ మూడోదఫా(థర్డ్వేవ్) విజృంభణ కొనసాగుతోంది. ఫ్రాన్స్లో కొవిడ్ మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. కరోనా రోగులతో అక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాలు కిక్కిరిసిపోతున్నాయి. వీటివల్ల ఆసుపత్రులు, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరోసారి పూర్తి లాక్డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని మేక్రాన్ ప్రకటించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి వ్యవస్థలన్నీ తెరిచే ఉంచాలనే తన లక్ష్యాన్ని మెక్రాన్ వదులుకోవాల్సి వచ్చింది.
‘ప్రస్తుతం మనం సరైన చర్యలు తీసుకోకుంటే..నియంత్రణ కోల్పోతాం’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ లాక్డౌన్ ప్రకటన సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయని.. ప్రస్తుతం వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ తొలి శనివారం నుంచి మూడు వారాలపాటు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు.
కొవిడ్ కేసుల్లో ప్రపంచంలోనే నాలుగో స్థానం..
కరోనా వైరస్ విజృంభణతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన ఫ్రాన్స్..మరోసారి లాక్డౌన్ విధించేందుకు అధ్యక్షుడు మేక్రాన్ సుముఖత చూపలేదు. మరోసారి లాక్డౌన్ విధించకుండానే దేశాన్ని ముందుకు నడుపుతానని పలు సందర్భాల్లో వెల్లడించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తంచేశారు. కానీ, ప్రస్తుతం పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో మూడోసారి లాక్డౌన్ విధించక తప్పలేదని తెలుస్తోంది. జాన్స్హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ఫ్రాన్స్లో కొవిడ్ కేసుల సంఖ్య 47లక్షలు దాటగా, దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ కేసుల్లో భారత్ మూడోస్థానంలో ఉండగా, ఫ్రాన్స్ ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉంది. ప్రస్తుతం అక్కడ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పొరుగుదేశం బ్రిటన్తో పోలిస్తే వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. లాక్డౌన్తో ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ, అధ్యక్షుడు మాత్రం జూన్ నాటికి దేశ జనాభాలో సగం మందికి(3కోట్ల మందికి) వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
Doordarshan: ‘డీడీ న్యూస్’ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘ప్రసార భారతి’ కాదని ‘ప్రచార భారతి’గా మారిందని పలువురు మండిపడుతున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్