Corona: చైనాలో.. అంతకుముందే కొవిడ్ వ్యాప్తి!
కరోనా వైరస్కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెడుతోందా? 2019 డిసెంబర్లో ఇది వెలుగు చూసినట్లు చెబుతున్నప్పటికీ.. అంతకుముందే చైనాలో వైరస్ వ్యాప్తి చెందిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది.
బ్రిటన్ పరిశోధకుల తాజా అధ్యయనం
లండన్: కరోనా వైరస్కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెడుతోందా? 2019 డిసెంబర్లో ఇది వెలుగు చూసినట్లు చెబుతున్నప్పటికీ.. అంతకుముందే చైనాలో వైరస్ వ్యాప్తి చెందిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఇలాంటి అనుమానాలను ఇప్పటికే పలు అధ్యయనాలు వ్యక్తం చేయగా.. తాజాగా బ్రిటన్ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. చైనా పేర్కొన్నట్లుగా డిసెంబరులో కాకుండా అంతకు రెండునెలల ముందే వైరస్ వ్యాప్తి చెందినట్లు అంచనా వేస్తున్నారు. బ్రిటన్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయన ఫలితాలు ఓ అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దీన్ని తెలుసుకునేందుకు ఓ వైపు అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో వాటి మూలాలను చైనా చెరిపేస్తున్నట్లు తేలింది. ఇదే సమయంలో కరోనా వైరస్ డిసెంబర్ 2019లో బయటపడిందని చైనా చెబుతున్నప్పటికీ.. అంతకు రెండు నెలలముందే, అంటే అక్టోబర్ నుంచే చైనాలో వైరస్ వ్యాప్తి చెందిందని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ కెంట్కు చెందిన డేవిడ్ రాబర్ట్ బృందం చేసిన అధ్యయనంలో తేలింది.
తొలికేసు నవంబర్ 17నే?
కరోనా వైరస్ వ్యాప్తి తొలుత ఎప్పుడు మొదలైందనే విషయం తెలుసుకునేందుకు డేవిడ్ రాబర్ట్ బృందం నడుం బిగించింది. ఇందుకోసం అంతరించిపోయే జాతుల జాడలను తెలుసుకునేందుకు రూపొందించిన ఓ గణిత నమూనాను పరిశోధకులు ఉపయోగించారు. వైరస్ కారకాలుగా భావిస్తోన్న జీవజాతుల వీక్షణల ఆధారంగా అంచనా వేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి నమోదైన కేసుల వివరాలను రివర్స్ నమూనా పద్ధతిలో విశ్లేషించారు. దీనిలో అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలోనే చైనాలో తొలికేసు నమోదైనట్లు గుర్తించారు. నవంబర్ 17న వుహాన్లో తొలికేసు వెలుగు చూసిందని.. జనవరి 2020 నాటికి ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే అంచనాకు వచ్చారు.
తొలుత ఆ ఐదు దేశాల్లో!
కరోనా వైరస్ వ్యాప్తి గురించి చైనా అధికారికంగా పేర్కొన్న దానికంటే.. అత్యధిక వేగంగా అది వ్యాప్తి చెందిందని బ్రిటన్ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా చైనా తర్వాత తొలుత మరో ఐదు దేశాలకు 2020 జనవరిలోనే విస్తరించిందని అంచనా వేశారు. ముఖ్యంగా 2020 జనవరి 3న జపాన్లో తొలికేసు నమోదుకాగా, జనవరి 7న థాయిలాండ్లో తొలికేసు నమోదైనట్లు అంచనా వేశారు. ఇక జనవరి 12న స్పెయిన్లో తొలికేసు నమోదుకాగా.. దక్షిణ కొరియాలో జనవరి 14న వైరస్ వెలుగు చూసిందని అన్నారు. ఇలా అనతి కాలంలోనే ఆసియా మొత్తం వ్యాపించిన కరోనా వైరస్.. జనవరి 16న అమెరికాకు పాకిందని అంచనా వేశారు. ఈ సందర్భంగా కరోనా మూలాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. తదేకంగా కొనసాగుతోన్న వైరస్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి అవి ఎంతో దోహదం చేస్తాయని బ్రిటన్ పరిశోధకులు స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో సంభవించే అంటువ్యాధుల వ్యాప్తి క్రమాన్ని తెలుసుకునేందుకు తాజా అధ్యయన విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
చైనా కుటిల యత్నాలు నిజమే: ధ్రువీకరించిన అమెరికా
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. తొలినాళ్లలో కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్న మాట వాస్తవమేనని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
బెంగళూరు కేఫ్లో బాంబు పేలుడు నిందితుల ఆచూకీ చెప్పిన వారికి ఎన్ఐఏ రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది. -
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
Anand Mahindra - Elon Musk: తయారీ రంగంలో హీరోల జీవితాలను వెండి తెరపైకి తీసుకురావాలని ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపును ఆనంద్ మహీంద్రా స్వాగతించారు. -
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ