అలా చేయండి.. వ్యవసాయంలో లాభనష్టాలు తెలుస్తాయ్‌

పార్లమెంటులో వ్యవసాయ పరిశోధనాలయాన్ని ప్రారంభించమంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్ టికాయిత్‌ అన్నారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 24 Feb 2021 20:54 IST

రైతు నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌

గాజీపూర్‌: పార్లమెంటులో వ్యవసాయ పరిశోధనాలయాన్ని ప్రారంభించాలని, అప్పుడే వ్యవసాయంలో లాభనష్టాలు తెలుస్తాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్ టికాయిత్‌ అన్నారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వామినాథన్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మేం కనీస మద్దతు ధర ఎక్కువ అడుగుతున్నామని వారు భావిస్తున్నారు. అందుకే పార్లమెంటు ఆవరణలోనే ఒక వ్యవసాయ పరిశోధనాలయాన్ని నెలకొల్పండి. పంటలపై పరిశోధనలు చేయండి. అప్పుడైనా మీకు వాటిలో లాభ నష్టాలు గురించి తెలుస్తాయి’’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఉద్యమంతోనైనా రాజకీయపార్టీలు రైతులు సంక్షేమంపై దృష్టిసారిస్తాయన్నారు.

అలాగే అంతకుముందు రాజస్థాన్‌లో జరిగిన ఓ సమావేశంలో టికాయిత్‌ మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే 40లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. మరోవైపు కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు అంగీకరిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని