Israel-Palestine conflict: రెచ్చగొడుతున్న ఎర్డోగన్!
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. హమాస్ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రతరం కావడంతో 9 వేల మంది రిజర్వుడు సైనికులను గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మోహరించింది..........
ఘర్షణల్లోకి లెబనాన్!
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. హమాస్ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రం కావడంతో 9 వేల మంది రిజర్వుడు సైనికులను గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మోహరించింది. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన రాకెట్ దాడులు, వైమానిక దాడులు నుంచి ఘర్షణలు భూభాగానికీ పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి స్థాయి యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
గాజాలో 100 మంది మరణం..
మరోవైపు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని 100 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పాలస్తీనా తరఫున హమాస్ ఉగ్రవాద సంస్థ నిరంతరాయంగా రాకెట్లను వదులుతోంది. ఇప్పటి వరకు దాదాపు 1,750 రాకెట్లను ప్రయోగించినట్లు సమాచారం. దీంతో ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ రాకెట్లలో 90 శాతాన్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది.
ఇజ్రాయెల్లో అంతర్గత ఘర్షణలు..
ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సహా మరికొన్ని నగరాల్లో అరబ్బులు, యూదుల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అంతర్గతంగానూ తీవ్ర ఘర్షణలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, అప్రమత్తమైన ప్రభుత్వం అల్లర్లను నియంత్రించేందు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించింది. ఇప్పటి వరకు 400 మందిని అరెస్టు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్నింటిని ఇతర చోట్లకు మళ్లించారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, అణు రియాక్టర్లున్న డిమోనా, జెరూసలెం లక్ష్యంగా హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు గాజాలోని నిఘా వ్యవస్థకు సంబంధించిన భవనాలు, పాలస్తీనా మిలిటరీకి సంబంధించిన స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు జరుపుతోంది.
రాజీకి విఫలయత్నం..
ఈ ఘర్షణలకు నిలువరించడానికి అంతర్జాతీయ సమాజం సిద్ధమైంది. ఇరు వర్గాల మధ్య సంధి కుదిర్చేందుకు ఈజిప్టు విఫలయత్నం చేసింది. ఇరు దేశాల ప్రతినిధులు, హమాస్ ఉగ్రవాద నేతలతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి సహా అమెరికా తాజా పరిస్థితిపై పర్యవేక్షణకు సీనియర్ దౌత్యవేత్తలను పంపింది.
లెబనాన్ ఎంట్రీతో ప్రమాదకర సంకేతాలు..
ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ ఇరు దేశాల మధ్య ఘర్షణల్లోకి లెబనాన్ కాలుపెట్టినట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఘర్షణలు విపరీత పరిస్థితులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు గురువారం సాయంత్రం మూడు రాకెట్లు దూసుకొచ్చినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ఘర్షణలను ఉద్దేశించి ఇటీవల ఎర్డోగన్ ఓ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పాలస్తీనాకు మద్దతుగా నిలవకపోతే.. ఇస్లాం దేశాలన్నింటికీ ప్రమాదం పొంచి ఉందంటూ అక్కరకు రాని జోస్యం చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతునూ కోరే ప్రయత్నం చేశారు. పుతిన్ మాత్రం ఐరాస సూచించిన సయోధ్యకు తాము మద్దతుగా నిలుస్తున్నామంటూ దౌత్యనీతిని ప్రదర్శించారు.
ఎగదోస్తున్న ఎర్డోగన్.. ఇజ్రాయెల్కు మద్దుతగా బైడెన్ ప్రకటన
మరోవైపు కొన్ని ఇస్లాం దేశాలు పాలస్తీనాకు అనుకూల ప్రకటనలు చేయడం ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యే ఇజ్రాయెల్తో సత్సంబంధాలను పునరుద్ధరించిన సౌదీ అరేబియా సైతం ఇజ్రాయెల్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘అల్ అఖ్సా పవిత్రతపై ఇజ్రాయెల్ సామ్రాజ్యవాద దళాలు దాడి చేశాయి’’ అని సౌదీ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్, బహ్రెయిన్, యూఏఈ, ఇరాన్, కువైట్ సైతం ఇదే బాటలో పయనించాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాము గాజాకు మద్దతుగా నిలుస్తున్నామని ప్రకటించారు. మరోవైపు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ టర్కీ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పాలస్తీనియన్లకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓపక్క ఐరాస సమయమనం పాటించాలని ఇరుపక్షాలకు విజ్ఞప్తి చేయగా.. మరోవైపు ‘మౌనం ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడంతో సమానం’ అంటూ ఎర్డోగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలకు తక్షణమే ముగింపు పలకకపోతే విపరీత పరిణామాలు చోటుచేసుకోవచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇజ్రాయెల్కు మద్దతుగా ప్రకటన చేయడంతో ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!