‘రద్దు’కే రైతన్నలు.. కష్టమన్న కేంద్రం
వ్యవసాయ చట్టాలపై కేంద్ర, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాల రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు
కొనసాగుతున్న ప్రతిష్టంభన: 15న మళ్లీ చర్చలు
దిల్లీ: వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసా...గుతూనే ఉంది. చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నదాతలు పట్టుబట్టగా.. అది మాత్రం కుదరదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎనిమిదో విడత చర్చలు కూడా ఫలించలేదు. చట్టాలను ఉపసంహరించుకుంటేనే తాము ఇళ్లకు వెళ్తామని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో తదుపరి దఫా చర్చలను జనవరి 15వ తేదీకి వాయిదా వేశారు.
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న 41 రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. అయితే చర్చలు ప్రారంభమైన కాసేపటికే ఇరు వర్గాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. కొత్త చట్టాలను దేశ ప్రజలందరి కోసం తీసుకొచ్చామని, ఇవి ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కావని మంత్రుల బృందం తెలిపింది. చట్టాలను రద్దు చేయడం కుదరదని చెప్పినట్లు సమాచారం. ‘చట్టాలను రద్దు చేయలేం. కావాలంటే మీరు సుప్రీంకోర్టు వెళ్లొచ్చు. ఈ చట్టాలు అక్రమమని న్యాయస్థానం చెబితే మేం ఉపసంహరించుకుంటాం. ఒకవేళ చట్టబద్ధమైనవేనని తీర్పు వస్తే మీరు ఉద్యమాన్ని విరమించుకోవాలి’ అని మంత్రుల బృందం రైతులకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇందుకు రైతు నాయకులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. సుప్రీం ప్రక్రియకు చాలా సమయం పడుతుందన్న రైతు ప్రతినిధులు.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ‘చట్టాలను వెనక్కి తీసుకుంటేనే మేం ఇళ్లకు వెళ్లిపోతాం’ అని రైతులు చెప్పినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
ఏకాభిప్రాయం కుదరలేదు: తోమర్
రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. చట్టాలు రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం చెప్పాలని రైతులను కోరామన్నారు. దేశంలో చాలా మంది చట్టాలను సమర్థిస్తున్నారని, రైతులతో మరోసారి ఈ నెల 15న చర్చలు జరుపుతామని మంత్రి తెలిపారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం: రైతులు
‘‘కేంద్రం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. చర్చల్లో సాగు చట్టాల రద్దు కుదరని చెప్పింది. ఇతర రైతు సంఘాలు సాగు చట్టాలకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి చట్టాలను వెనక్కి తీసుకోలేమని చెప్పింది. సుప్రీంకోర్టు నిర్ణయానికే వదిలేస్తే మంచిదని బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చర్చలు జరుగుతున్న వేళ కేంద్రం మధ్యలో తప్పుకొని సుప్రీంకోర్టు తేలుస్తుందని అనడం దేనికి నిదర్శనం? సాగు చట్టాల రద్దు తప్ప మరేదీ ఆమోద యోగ్యం కాదని చెప్పాం. సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఆందోళన విరమిస్తాం’’ అని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నేత కవిత కురుగంటి అన్నారు.
హాలు నుంచి వచ్చేసిన మంత్రులు
రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకపోవడంతో కేంద్ర మంత్రులు సమావేశ గది నుంచి బయటకు వచ్చేశారు. అధికారులతో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో రైతు సంఘాల నేతలు గదిలో మౌనం పాటించారు. ‘విజయం లేదా వీరమరణం’ అనే రాసి ఉన్న పేపర్లు పట్టుకుని నిరసన తెలిపారు. అంతేగాక, భోజనం చేసేందుకు కూడా రైతులు నిరాకరించారు. భోజన విరామ సమయంలోనూ సమావేశ గదిలోనే ఉండిపోయారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
వైకాపా ఎమ్మెల్సీ భరత్ భార్యకు కోడ్ వర్తించదా?
కుప్పంలో తన భర్త తరఫున నామినేషన్ వేయడానికి ఎన్నికల నిబంధనలు బేఖాతరు చేస్తూ వైకాపా ఎమ్మెల్సీ భరత్ భార్య రెండు కార్లతో ఆర్వో కార్యాలయంలోకి వెళ్లినా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ధ్వజమెత్తారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.