Education: సిలబస్ తగ్గించడం కాదు.. సంస్కరణలు చేపట్టాలి!
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావిధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల కెరీర్ను దృష్టిలో పెట్టుకొని సిలబస్ను తగ్గించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. అయితే, ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని
కరోనా నేపథ్యంలో విద్యావిధానంపై విద్యావేత్తల అభిప్రాయం
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావిధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థుల కెరీర్ను దృష్టిలో పెట్టుకొని సిలబస్ను తగ్గించాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) భావిస్తోంది. అయితే, ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని.. సిలబస్ తగ్గించడంపై కాకుండా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
సిలబస్ తగ్గించడం కన్నా.. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడమే చాలా ముఖ్యం. విద్యార్థుల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించి.. వారి విద్యా ప్రయాణాన్ని అర్థవంతంగా కొనసాగించడంపై దృష్టి సారించాల్సిన అవసరముందని విద్యావేత్త డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు.
సిలబస్ తగ్గించడం వల్ల ప్రాథమిక, ఉన్నత విద్యపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నీట్, జేఈఈ పరీక్షలు రాసేవారికి ఎన్సీఈఆర్టీ పూర్తి సిలబస్ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు వారంతా తగ్గించిన సిలబస్ను చదివితే గందరగోళానికి గురయ్యే అవకాశముందని బెంగళూరుకి చెందిన ఓ పాఠశాల ప్రిన్సిపల్ డబ్ల్యూఆర్ డేవిడ్ తెలిపారు. విద్యార్థులు వారి పాఠ్యపుస్తకాల కన్నా బాహ్యప్రపంచం నుంచే ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని, సిలబస్ తగ్గింపుతో విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదని ఘజియాబాద్కు చెందిన టీచర్ రచన రాయ్ తెలిపారు. ఈ కాలం విద్యార్థులు జ్ఞానం పెంచుకోవడానికి పాఠ్యపుస్తకాలపై ఆధరపడట్లేదని, సమాచారం కోసం ఇంటర్నెట్ ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నారని చెప్పారు.
సిలబస్ను ఒక్కసారి తగ్గించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపే కన్నా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని మరికొందరు విద్యావేత్తలు కోరుతున్నారు. విద్యావ్యవస్థను మరింత మెరుగుపర్చే విధంగా కొత్త బోధన పద్ధతులను అమలు చేయాలంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం