Long Range Bomb: డీఆర్డీఓ ‘లాంగ్ రేంజ్ బాంబ్’ పరీక్ష విజయంతం
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన భారత్.. తాజాగా మరో ఘనత సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్(ఎల్ఆర్బీ)ను భారత వాయుసేన(ఐఏఎఫ్)...
భువనేశ్వర్: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ని ఇటీవల విజయవంతంగా పరీక్షించిన భారత్.. తాజాగా మరో ఘనత సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ బాంబ్ (ఎల్ఆర్బీ)ను భారత వాయుసేన (ఐఏఎఫ్) భాగస్వామ్యంతో శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఐఏఎఫ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ గైడెడ్ బాంబ్.. భూమి పైనున్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మిషన్ లక్ష్యాలన్నీ విజయవంతంగా నెరవేరినట్లు పేర్కొంది. ప్రయోగంలో భాగంగా బాంబ్ గమనం, పనితీరును ట్రాక్ చేసేందుకు ఈఓటీఎస్ (ఎలక్ట్రో- ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్), టెలిమెట్రీ, రాడార్తో సహా వివిధ శ్రేణుల సెన్సార్లను వినియోగించారు. ఈ సెన్సార్లను ఇక్కడి చాందీపుర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) వద్ద ఏర్పాటు చేశారు.
రాజ్నాథ్ సింగ్ అభినందన..
ఈ ప్రయోగం విజయవంతంతో ఈ రకమైన దేశీయ పరిజ్ఞాన వ్యవస్థల అభివృద్ధిలో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకున్నట్లు రక్షణ శాఖ ఆర్ అండ్ డీ విభాగం కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. ఈ ఎల్ఆర్బీని హైదరాబాద్లోని డీఆర్డీఓ లేబోరేటరీ ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ)’, డీఆర్డీఓకే చెందిన ఇతర ప్రయోగశాలల సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగం విజయవంతంపై రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ.. డీఆర్డీఓ, ఐఏఎఫ్ ఇతర విభాగాల అధికారులను అభినందించారు. ఈ గైడెడ్ బాంబ్.. భారత సాయుధ బలగాలకు మరింత పోరాట సామర్థ్యాన్ని చేకూర్చుతుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం