మహారాష్ట్రను కలవరపెడుతోన్న ‘డబుల్ మ్యుటేషన్’!
మహారాష్ట్రలో 61శాతం శాంపిళ్లలో డబుల్ మ్యుటేషన్ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి ఈ డబుల్ మ్యుటేషన్ కారణమని చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు.
361 నమూనాల్లో 61శాతం ఈ రకానివే..
ముంబయి: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణకు మహారాష్ట్ర విలవిలలాడుతోంది. నిత్యం కొత్తగా అక్కడ 60వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడ వైరస్ ఉద్ధృతికి ‘డబుల్ మ్యుటేషన్’ కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నమూనాలను విశ్లేషించగా వాటిలో 61శాతం శాంపిళ్లలో డబుల్ మ్యుటేషన్ బయటపడినట్లు వైరాలజీ నిపుణులు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి ఈ డబుల్ మ్యుటేషన్ కారణమని చెప్పలేమన్నారు.
దేశంలో కరోనా వైరస్ ప్రవర్తనను అంచనా వేసేందుకు పాజిటివ్ వచ్చిన రోగుల నమూనాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలో జనవరి-మార్చి మధ్య కాలంలో 361 కరోనా శాంపిళ్లను పుణెలోని జాతీయ వైరాలజీ కేంద్రంలో విశ్లేషించారు. వాటిలో 61శాతం కేసుల్లో డబుల్ మ్యుటేషన్లు బయటపడినట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మహారాష్ట్రలో నిత్యం 2లక్షల కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారని.. వాటిలో చిన్న మొత్తంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టామని నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి డబుల్ మ్యుటేషన్ కారమణమని ఈ ఫలితాల ద్వారా పేర్కొనలేమని వైరాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించిన నమూనాల ఫలితాలను ల్యాబొరేటరీలు వెల్లడించడం లేదని బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైరస్ పరివర్తనాలను తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందని బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకానీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వైరస్ రకం ఎంత ప్రభావవంతమైనదో తెలిస్తే ప్రజలను కూడా అప్రమత్తం చేసే వీలుంటుందన్నారు.
శాంపిళ్ల సేకరణపై ఆందోళన..
డబుల్ మ్యుటేషన్ను గుర్తించేందుకు శాంపిల్ సేకరణ ఎంతో కీలకమని వైరాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో స్థానికంగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వైద్య సిబ్బంది అనుసరిస్తున్న విధానం కొంత ఆందోళన కలిగించే విధంగా ఉందన్నారు. ఉదహరణకు నాసిక్ నుంచి పంపించిన అన్ని నమునాల్లో డబుల్ మ్యుటేషన్ కనిపించిందని..ఇందుకు శాంపిల్ సేకరణలోనే లోపం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అందుకే యాదృచ్ఛిక నమూనా(రాండమ్)లో వీటిని సేకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డబుల్ మ్యుటేషన్ ఎలా..?
వైరస్లోని రెండు ఉత్పరివర్తనాలు కలిసి ఒకే రకంగా మారడాన్నే ‘డబుల్ మ్యుటేషన్’గా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత్లో వెలుగుచూసిన L452R, E484Q మ్యుటేషన్ రకాల స్పైక్ ప్రొటీన్లలోని గ్రహకాలు కలిసిపోయి కొత్తరకంగా మారుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, ఇలా మ్యుటేషన్ చెందిన రకాలు కలిసిపోవడం సాధారణ ప్రక్రియేనని వైరాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో వెలుగు చూసిన కొత్తరకాలతో పాటు భారత్లో కొత్తగా ‘డబుల్ మ్యుటేషన్’ వైరస్ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇదివరకే వెల్లడించింది. మహారాష్ట్రలోనే వీటి ప్రభావం ఎక్కువగా ఉండగా..ఇతర ప్రాంతాల్లోనూ వైరస్ మ్యుటేషన్లలో మార్పులు గమనించినట్లు పేర్కొంది. వైరస్ ఉద్ధృతికి ఈ మ్యుటేషన్లే కారణమా అనే కోణంలో ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.