Firecrackers: దిల్లీలో 6వేల కిలోల బాణసంచా సీజ్‌

దేశ రాజధాని దిల్లీలో పోలీసులు 6వేల కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. 55మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో బాణసంచా కాల్చడాన్ని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నిషేధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు బాణసంచాలు

Published : 03 Nov 2021 23:51 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పోలీసులు 6 వేల కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. 55 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో బాణసంచా కాల్చడాన్ని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నిషేధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు బాణసంచాలు పేల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముందుస్తు చర్యగా పోలీసులు బాణసంచా తయారీ సంస్థలను, దుకాణాలను మూసివేయించారు.

అయినా అక్రమంగా, పొరుగురాష్ట్రాల నుంచి బాణసంచా తరలిస్తున్నారు. దీంతో దిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నార్త్‌ డిస్ట్రిక్ట్‌లో 2,400 కిలోలు, రోహిణి డిస్ట్రిక్ట్‌లో 1,153 కిలోలు, సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌లో 298 కిలోల బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొందరు ఉత్తరప్రదేశ్‌, హరియాణా నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసి దిల్లీలో అక్రమంగా విక్రయించడానికి తీసుకొస్తున్నట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు