Vaccination: కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మధ్య వ్యత్యాసం అదే..!
కరోనా టీకాలు భారత్కు భారీగా ప్రయోజనాన్ని చేకూర్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మూడో వేవ్ సమయంలో టీకా కారణంగా మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉందని పేర్కొంది. అలాగే రెండో వేవ్, తాజా ఉద్ధృతికి మధ్య పోలిక తెస్తూ ఆరోగ్య శాఖ టీకా ఆవశ్యతను వివరించింది.
వివరించిన కేంద్ర ఆరోగ్య శాఖ
దిల్లీ: కరోనా టీకాలు భారత్కు భారీగా ప్రయోజనాన్ని చేకూర్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మూడో వేవ్ సమయంలో టీకా కారణంగా మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉందని పేర్కొంది. అలాగే సెకండ్ వేవ్, తాజా ఉద్ధృతికి మధ్య పోలిక తెస్తూ ఆరోగ్య శాఖ టీకా ఆవశ్యతను వివరించింది.
కరోనా రెండో దశలో ఏప్రిల్ 30న 3,86,452 కొత్త కేసులు వచ్చాయి. 3,059 మరణాలు సంభవించాయి. 31 లక్షల క్రియాశీల కేసులున్నాయి. అప్పుడు 2 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇప్పటి విషయానికి వస్తే.. జనవరి 20, 2022న 3,17,532 కొత్త కేసులొచ్చాయి. 380 మరణాలు నమోదయ్యాయి. వైరస్ బాధితుల సంఖ్య 19 లక్షలకు పైనే ఉంది. అర్హులైన జనాభాలో 72 శాతం మందికి రెండు డోసులు అందాయి. అప్పుడూ ఇప్పుడూ కొత్త కేసులు మూడు లక్షలపైనే ఉన్నప్పటికీ.. మరణాల పరంగా భారీ వ్యత్యాసం కనిపిస్తుండటం గమనార్హం.
ఐరోపాలో తగ్గుతూ..ఆసియాలో పెరుగుతున్న వైరస్ వ్యాప్తి..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగోసారి కేసులు పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 29 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఐరోపా దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుతుండగా.. ఆసియా దేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మన దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ్ బెంగాల్, యూపీ, గుజరాత్, ఒడిశా, దిల్లీ, రాజస్థాన్ క్రియాశీల కేసులు పరంగా మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. దాంతో ఆయా రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
160 కోట్ల డోసుల పంపిణీ..
ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 160 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. అర్హులైన జనాభాలో సుమారు 72 మంది రెండు డోసులు తీసుకున్నారు. అలాగే 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారిలో 52 శాతం మంది మొదటి డోసు వేయించుకున్నారు. అలాగే 61 లక్షలకు పైగా ప్రికాషనరీ డోసులు వేసినట్లు కేంద్రం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్