saudi Crown Prince: ‘నాటి రాజు హత్యకు ఎంబీఎస్ యత్నం’..!
ప్రస్తుత సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై ఓ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. నాటి రాజు అబ్దుల్లాను ఎంబీఎస్ చంపాలనుకున్నట్లు సాద్
సౌదీ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుత సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై ఓ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. నాటి రాజు అబ్దుల్లాను బిన్ సల్మాన్ చంపాలనుకున్నట్లు సాద్ అల్ జబ్రి అనే మాజీ సీనియర్ సౌదీ సెక్యూరిటీ ఉద్యోగి పేర్కొన్నాడు. సాద్ గతంలో సౌదీ తరపున అమెరికా యాంటీ టెర్రర్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు.
సాద్ కథనం ప్రకారం.. 2014లో బిన్ సల్మాన్కు సౌదీ ప్రభుత్వంలో ఎటువంటి పదవీ ఇవ్వలేదు. ఆ సమయంలో అతని తండ్రి సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ యువరాజుగా (క్రౌన్ప్రిన్స్)గా ఉండేవారు. అయినా కూడా ఎంబీఎస్కు న్యాయస్థానంలో గేటు కీపర్గా ఉండాల్సి వచ్చింది. దీంతో ఎంబీఎస్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. అదే ఏడాది తన సోదరుడు, నాటి ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ నయీఫ్తో ఎంబీఎస్ భేటీ అయ్యాడు. ఈ సందర్భంగా ఎంబీఎస్ మాట్లాడుతూ రష్యా నుంచి విషపూరిత ఉంగరం తెప్పించి రాజు అబ్దుల్లాని చంపాలనుందని అన్నాడు. కేవలం ఒక్కసారి రాజు అబ్దుల్లాకి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు ఆ తర్వాత విష ప్రభావంతో రాజు చనిపోతాడని.. అప్పుడు తన తండ్రి సల్మాన్ బిన్ అబ్దులజీజ్ రాజు అవుతాడని వ్యాఖ్యానించాడు. ఈ విషయాన్ని సౌదీ ఇంటెలిజెన్స్ తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత రాజకుటుంబలో వివాదాన్ని పరిష్కరించారు.
ఎంబీఎస్-నయీఫ్ భేటీకి సంబంధించిన వీడియో తన వద్ద ఉందని సాద్ పేర్కొన్నాడు. తన ప్రాణాలకు హాని జరిగితే ఆ వీడియోను విడుదల చేస్తానని పేర్కొన్నాడు. 2015 కింగ్ అబ్దుల్లా సహజ కారణాలతో మరణించారు. ఆ తర్వాత సల్మాన్ బిన్ అబ్దులజీజ్ రాజుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత క్రౌన్ ప్రిన్స్ అయిన నయీఫ్ను 2017లో పక్కకు తప్పించి బిన్ సల్మాన్ ఆ పదవిలోకి వచ్చాడు. నాటి నుంచి సౌదీ అరేబియా అప్రకటిత రాజుగా వ్యవహరిస్తున్నాడు.
సాద్ ప్రస్తుతం సౌదీ అరేబియా నుంచి పారిపోయి.. కెనడాలో ఆశ్రయం పొందుతున్నాడు. సాద్ పిల్లలు ఇద్దరు సౌదీప్రభుత్వం వద్ద బందీలుగా ఉన్నారు. తనని చంపే వరకు ఎంబీఎస్ ఊరుకోరని సాద్ సీబీఎస్ న్యూస్ ఛానెల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!