Wuhan: ఇలా అయితే, కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు!
దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా మూలాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. కాల గమనంలో ఈ మహమ్మారి పుట్టుకపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరు వుహాన్లోని......
వాషింగ్టన్: దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా మూలాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. కాల గమనంలో ఈ మహమ్మారి పుట్టుకపై అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కొందరు వుహాన్లోని వైరాలజీ ల్యాబ్ నుంచే వైరస్ బయటకొచ్చిందని వాదిస్తుండగా.. మరికొందరేమో ప్రకృతి నుంచే సహజంగా పుట్టుకొచ్చిందంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా వుహాన్ ల్యాబ్ థియరీని బలపరుస్తూ పలు సంస్థలు, నిపుణులు కథనాలు ప్రచురిస్తున్నారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ఇద్దరు నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టుకొచ్చిందంటూ వస్తున్న వాదనకు మద్దతు పెరుగుతోందని ట్రంప్ హయాంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ)కు కమిషనర్గా పనిచేసిన స్కాట్ గాట్లియెబ్ అన్నారు. వుహాన్ ల్యాబ్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని నిరూపించేలా చైనా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గాట్లియెబ్ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. సీబీఎస్ ఛానెల్లో ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో వైద్య నిపుణుడు పీటర్ హోటెజ్ మాట్లాడుతూ.. కొవిడ్-19 మూలాలు తెలియనంత వరకు ప్రపంచానికి భవిష్యత్తు మహమ్మారుల ముప్పు తప్పదని హెచ్చరించారు. కొవిడ్-26, కొవిడ్-32 మహమ్మారులు ఉద్భవించొచ్చని అభిప్రాయపడ్డారు. పీటర్ ప్రస్తుతం ‘టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్’కు కో-డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
కరోనా వైరస్ వుహాన్లోని వైరాలజీ ల్యాబ్లోనే ఉద్భవించిందని వస్తున్న వాదనను బలపరుస్తూ ఇటీవల పలు కథనాలు తెరపైకి వచ్చాయి. చైనా శాస్త్రవేత్తలే ల్యాబ్లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడింది. పైగా అది గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు నమ్మించేందుకు ‘రివర్స్ ఇంజినీరింగ్’కు ప్రయత్నించినట్లు తెలిపారు. కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్కు ‘విశ్వసనీయమైన సహజసిద్ధ పూర్వరూపం’ ఏదీ లేదని చెప్పారు. సార్స్-కోవ్-2 వైరస్ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటిష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్గ్లిష్, నార్వే శాస్త్రవేత్త బిర్గర్ సొరెన్సెన్ తమ నివేదికలో పేర్కొన్నారు. చైనాలోని గుహల్లో ఉండే గబ్బిలాల్లో ఉండే సహజసిద్ధ కరోనా వైరస్లోని ‘మూలపదార్థం’ను సేకరించి, దానిలోకి కొత్త ‘స్పైక్’ను చొప్పించారని వీరు తెలిపారు. తద్వారా ఈ వైరస్ ప్రమాదకరంగా, తీవ్రంగా వ్యాపించేలా రూపాంతరం చెందిందన్నారు. మరోవైపు బాహ్య ప్రపంచంలో సార్స్కోవ్-2 వైరస్ వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్లోని చాలా మంది పరిశోధకులు అస్వస్థతకు గురయ్యారని.. వీరిందరిలో కొవిడ్19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు కనిపించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ పరిణామాలతో వుహాన్ థియరీ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి